Ram Charan Tweet: ఉదయనిధికి రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్, సనాతన ధర్మం మన బాధ్యత అంటూ ట్వీట్!
సినిమాలను ఇష్టపడే కొందరు హిందువులు ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తున్నారు.
- By Balu J Published Date - 04:06 PM, Mon - 4 September 23
Ram Charan Tweet: సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దాన్ని పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉదయనిధి స్టాలిన్పై బీజేపీ నిరసనలు తెలుపుతోంది. ఉదయనిధి స్టాలిన్పై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు కూడా ఉదయనిధి స్టాలిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. సనాతన ధర్మాన్ని ప్రస్తావిస్తూ రామ్ చరణ్ 2020లో ఒక ట్వీట్ చేశారు. రామ్ చరణ్ తన తల్లి సురేఖ కొణిదెల తన ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న చిత్రాన్ని ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 11, 2020న చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలే. సినిమాలను ఇష్టపడే కొందరు హిందువులు ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తున్నారు. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘సనాతన నిర్మూలన’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమన్నారు. ‘కొన్ని విషయాలను మనం వ్యతిరేకించకూడదు. మనం వారిని నిర్మూలించాలి. దోమలు, డెంగ్యూ, ఫ్లూ, మలేరియాలతో పోరాడితే సరిపోదు.. వాటిని నిర్మూలించాలి. సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడ్డారు. కేసులు పెడతామని హెచ్చరించారు. అయినా మంత్రి ఉదయనిధి స్టాలిన్ దిగిరావడం లేదు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘నాపై ఎలాంటి కేసునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విపక్షాల పొత్తుకు బీజేపీ భయపడుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఒక్కడే అన్నది డీఎంకే విధానం’’ అని ఉదయ నిధి చెప్పుకొచ్చారు.
Also Read: Nag Reaction: విజయ్.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ? మాజీ కోడలిని గుర్తు చేసుకున్న నాగార్జున!
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�