Trending
-
Chennai : ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Date : 14-06-2025 - 11:17 IST -
AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి
ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
Date : 14-06-2025 - 10:50 IST -
Advance Tax Alert: అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వచ్చేవారు ఎవరు? ఈనెల 15లోపు అర్జెంట్గా ఈ పని చేయాల్సిందే!
అడ్వాన్స్ టాక్స్ అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ముందస్తుగా చెల్లించబడే ఆదాయపు పన్ను. సాధారణంగా ఆదాయం సంపాదించిన తర్వాత టాక్స్ చెల్లించాలి. కానీ అడ్వాన్స్ టాక్స్ విషయంలో అలా కాదు.
Date : 13-06-2025 - 8:30 IST -
CM Chandrababu : సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. పలు అభివృద్ధి పనులకు ఆమోదం
సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 1,450 ఎకరాల భూమిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,052 కోట్ల విలువైన టెండర్లను పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
Date : 13-06-2025 - 7:18 IST -
Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
ప్రమాద స్థలమైన భవన శిథిలాల నుంచి విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారికంగా వెల్లడించింది. బ్లాక్బాక్స్లో దాచిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Date : 13-06-2025 - 6:52 IST -
Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు : మంత్రి లోకేశ్
కొందరి ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
Date : 13-06-2025 - 6:09 IST -
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో కొత్త మార్గదర్శక విలువలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు పలు మండలాల్లో స్థలాల మార్కెట్ ధరకట్టను సమీక్షించేందుకు ఫీల్డ్ పరిశీలనలు ప్రారంభించారు. ప్రత్యేకించి అపార్ట్మెంట్ల ధరల విషయంలో సుమారు 30 శాతం మేర పెంపు ఉండే సూచనలు ఉన్నాయి.
Date : 13-06-2025 - 5:06 IST -
KTR : మరోసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
. జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపినప్పటికీ, అప్పటికి కేటీఆర్ అమెరికాలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.
Date : 13-06-2025 - 4:41 IST -
PM Modi : విజయ్రూపానీ కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ పరామర్శ
విజయ్ రూపాణీ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విమానం ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, తక్షణ సహాయ చర్యలలో భాగంగా వైమానిక అధికారులు, ఆర్మీ, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
Date : 13-06-2025 - 3:59 IST -
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Date : 13-06-2025 - 2:36 IST -
Plane Crash : ఎలా బతికానో నాకే అర్థం కాలేదు..విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్.. ప్రమాద క్షణాలను గుర్తుచేస్తూ మీడియాతో అనుభవాలనుపంచుకున్నారు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అది భీకరంగా ఊగింది. నిమిషాల వ్యవధిలో అది ముక్కలైంది. నేను కూర్చున్న 11-ఏ సీటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. అది నా ప్రాణాలను రక్షించింది అని అన్నారు.
Date : 13-06-2025 - 1:06 IST -
Air India Compensation: ఎయిరిండియా రూ. కోటి కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందా?
విమాన ప్రయాణం చేసే ముందు భద్రత, భవిష్యత్తు ప్రణాళిక చాలా అవసరం. ఒక చిన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద ఆసరాగా ఉంటుంది. సురక్షిత ప్రయాణం కోసం ఇన్సూరెన్స్ను మీ అలవాటులో భాగం చేసుకోండి.
Date : 13-06-2025 - 12:54 IST -
Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
Date : 13-06-2025 - 12:49 IST -
India-China : త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
.భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిపాం. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మిస్రీ ప్రత్యేకంగా అభినందించారు.
Date : 13-06-2025 - 12:33 IST -
Iran : ప్రతీకార దాడులు..ఇజ్రాయెల్పై వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
వీటిలో చాలావరకు డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ బలగాలు గగనతలంలోనే గుర్తించి తిప్పికొట్టాయి. కానీ ఈ దాడుల వల్ల ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ఈ చర్యను పూర్తిగా ప్రతీకార చర్యగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇటీవల టెహ్రాన్ సమీపంలో జరిగిన గూఢచర్య దాడిలో తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తలు హతమయ్యారని ఇరాన్ ఆరోపించింది.
Date : 13-06-2025 - 12:23 IST -
PM Modi : అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని సమీక్ష.. విజయ్ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీ
విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలుపనున్నారు. దేశానికి అద్భుత సేవలు అందించిన నేతను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు.
Date : 13-06-2025 - 12:06 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు..కారణం ఇదే
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన దుర్మార్గమైన విమాన ప్రమాదం నేపథ్యంలో సీఎం తన పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసినట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Date : 13-06-2025 - 11:43 IST -
Roshni Songare: ఎయిర్ హోస్టెస్ కావాలని కల.. చివరకు విమాన ప్రమాదంలోనే మృతి!
డోంబివలి నివాసియైన 26 ఏళ్ల కుమారి రోషిణీ రాజేందర్ సోంఘరే కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆమె తండ్రి రాజేందర్ ధోండూ సోంఘరే (50), ఆమె తల్లి శోభా రాజేందర్ సోంఘరే (45), ఆమె చిన్న సోదరుడు విగ్నేష్ రాజేందర్ సోంఘరే (23).
Date : 13-06-2025 - 11:39 IST -
Thalliki Vandanam : విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ: టీడీపీ
ఇందులో భాగంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారుడి ఖాతాలో రూ.26,000 జమైనట్టు తెలిపింది. దీనిని ఆధారంగా తీసుకొని వచ్చిన బ్యాంక్ మెసేజ్ స్క్రీన్షాట్ను కూడా టీడీపీ షేర్ చేసింది. అదేవిధంగా మరో రూ.4,000 పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ అయినట్లు పేర్కొంది.
Date : 13-06-2025 - 11:19 IST -
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.
Date : 13-06-2025 - 10:32 IST