HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sweet News For Agrigold Victims Court Allows Recovery Of Assets Worth Over Rs 7 Thousand Crores

AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి

ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.

  • Author : Latha Suma Date : 14-06-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sweet news for Agrigold victims.. Court allows recovery of assets worth over Rs. 7 thousand crores
Sweet news for Agrigold victims.. Court allows recovery of assets worth over Rs. 7 thousand crores

AgriGold : అగ్రిగోల్డ్ మోసానికి బలైన లక్షలాది బాధితులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. ఎంతో కాలంగా న్యాయపోరాటం చేస్తున్న బాధితులకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఒక కీలకమైన విజయాన్ని అందించింది. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంచన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టు అగ్రిగోల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ అప్లికేషన్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు బాధితులకు అప్పగించేందుకు మార్గం ఏర్పడింది. ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.

Read Also: Russia Earthquake: రష్యాలో కురిల్ దీవుల్లో ఈ భూకంపం

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, బాధితుల నష్టాన్ని ఏ మేరకైనా పూడ్చేందుకు ఈడీ చర్యలు తీసుకోవడం ఎంతో ప్రాశస్త్యమైంది. తాజాగా అగ్రిగోల్డ్ గ్రూప్‌కు చెందిన రూ.611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. అప్పటి ఆస్తుల విలువ రూ.611 కోట్లు అయినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దీనితో బాధితులకు చెల్లింపుల ప్రక్రియ వేగంగా ముందుకు సాగేందుకు అవకాశం కలిగింది. ఇంతకు ముందు 2024 ఫిబ్రవరిలో ఈడీ సుమారు రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఇప్పుడు తాజా ఆస్తులు కలిపి మొత్తం పునరుద్ధరించిన ఆస్తుల విలువ రూ.3,950 కోట్లకు చేరింది. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.7 వేల కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఆస్తులలో మొత్తం 397 స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 ఆస్తులు తెలంగాణలో, మరియు 4 కర్ణాటకలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు వంటి రకరకాల ఆస్తులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయం వల్ల బాధితులకు న్యాయం అందే దిశగా గణనీయమైన అడుగు పడిందని, త్వరలోనే వారికి నష్టపరిహార చెల్లింపులు మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: Trump : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సరైనవే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AgriGold
  • AgriGold victims
  • ap
  • asset restitution
  • ED
  • PMLA Court
  • property distribution
  • scam victims
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd