Trending
-
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Date : 28-06-2025 - 4:33 IST -
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇప్పటికే రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకూ నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం కూడా ప్రకటన విడుదల కావడం విశేషం. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-06-2025 - 4:15 IST -
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
IndiGo Monsoon Sale: విమాన ప్రయాణీకులకు బంపరాఫర్.. రూ. 1500కే ప్రయాణం, ఆఫర్ ఎప్పటివరకు అంటే?
ఈ ఆఫర్ పీరియడ్ సమయంలో ఎకానమీ క్లాస్ ఒకవైపు టిక్కెట్ ధర ఎంపిక చేసిన దేశీయ రూట్లపై కేవలం 1499 రూపాయలు, ఎంపిక చేసిన విదేశీ రూట్లపై 4,399 రూపాయలు ఉంటుంది.
Date : 28-06-2025 - 12:20 IST -
Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య ఓ ముఖ్య నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Date : 28-06-2025 - 12:18 IST -
Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు
సిట్ ఆధికారులు తాజాగా ప్రాథమికంగా సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో నుండి బయటపడిన కొన్ని ఆడియో రికార్డింగులు దర్యాప్తును మరింత ఉత్కంఠతో నింపుతున్నాయి.
Date : 28-06-2025 - 12:06 IST -
Anchor Sweccha Votarkar : మానసిక వేదింపులు తట్టుకోలేక యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకుందా..?
Anchor Swetcha Votarkar : ఆమె మృతికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తోంది
Date : 28-06-2025 - 11:58 IST -
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Date : 28-06-2025 - 11:47 IST -
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Date : 28-06-2025 - 11:27 IST -
Post Offices: పోస్టాఫీసు వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి ప్రారంభం!
ప్రస్తుతం పోస్టాఫీసులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించలేకపోతున్నాయి. ఎందుకంటే వాటి అకౌంట్లు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సిస్టమ్తో సమకాలీకరణ కాలేదు.
Date : 28-06-2025 - 11:05 IST -
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 27-06-2025 - 8:16 IST -
Kolkata : కోల్కతాలో మరో దారుణం.. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కక్షతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగానికి చెందిన నేత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, టీఎంసీపీ (టీఎంసీ విద్యార్థి విభాగం) జనరల్ సెక్రటరీగా పనిచేసిన మనోజిత్ మిశ్రా (31) ఆమెపై పెళ్లి ఒత్తిడి తెచ్చాడు.
Date : 27-06-2025 - 7:41 IST -
Vijaya Rama Raju : ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నా, సంబంధిత అధికారులు నియామక ప్రక్రియను చేపట్టలేదు.
Date : 27-06-2025 - 7:15 IST -
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
Date : 27-06-2025 - 6:47 IST -
CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ తరహా హ్యాకథాన్లు యువతలో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా పనిచేస్తాయి. ఏఐ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినియోగించి భద్రతా రంగాన్ని ఆధునికీకరించాలి అని పేర్కొన్నారు.
Date : 27-06-2025 - 6:31 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-06-2025 - 5:09 IST -
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Date : 27-06-2025 - 4:49 IST -
TGEAPCET : టీజీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ (EAPCET) కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మూడు విడతలుగా ఈ ప్రవేశ కౌన్సిలింగ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Date : 27-06-2025 - 4:17 IST -
Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు.
Date : 27-06-2025 - 3:32 IST -
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Date : 27-06-2025 - 3:15 IST