Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
- Author : Latha Suma
Date : 27-06-2025 - 6:47 IST
Published By : Hashtagu Telugu Desk
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. భక్తుల భద్రత, విశ్వాసం తలకిందలు చేసే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం. నివేదికలోని విషయాలు కేసుకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విశ్వసనీయ సమాచారం మేరకు, సిట్ నివేదికలో దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలపై స్పష్టమైన ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. నిందితులు విచారణను ఆలస్యానికి గురిచేసేందుకు కావాలనే పలు వ్యూహాలు రూపొందించి, వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని సిట్ తన నివేదికలో ప్రస్తావించింది. అంతేగాక, విచారణ దశలో సాక్షులను బెదిరించడం, భయపెట్టే ప్రయత్నాలు కూడా నిందితుల వైఖరిలో భాగంగా ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల పాత్ర కేవలం కల్తీ లడ్డూల తయారీ వరకే పరిమితమై ఉండకపోవచ్చన్న అనుమానాలు కూడా నివేదిక ద్వారా వెలుగు చూసినట్టు సమాచారం. కొంతమంది ప్రభావవంతుల ప్రమేయం కూడా ఉన్నట్టు సిట్ విచారణలో గుర్తించినట్టు సమాచారం. అందువల్లే ఈ వ్యవహారం మరింత ఉద్రిత్తంగా మారే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, సిట్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో సుప్రీంకోర్టు త్వరలో ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ నివేదిక ఆధారంగా నిందితులపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు, ఈ నివేదిక వల్ల విచారణ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేస్తే, ఇప్పటి దాకా పటిష్టంగా సాగిన విచారణ మరింత బలంగా ముందుకు సాగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ తరహా చర్యలు తిరిగి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు న్యాయ వ్యవస్థపైనే ఉంది. ఈ నివేదిక వెలుగులోకి రావడం ద్వారా తిరుమల లడ్డూ కల్తీ కేసులో నిజాల వెలుగు చూసే దిశగా మరొక అడుగు ముందుకేసినట్లైంది.
Read Also: Black Jamun : అమృత ఫలం నేరేడు పండుతో మధుమేహానికి చెక్.. పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు!