HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Native Americans Irked As Us Firm Plans To Carry Cremated Human Remains To Moon

Human Remains To Moon : చంద్రుడిపైకి చితాభస్మం, అస్థికలు, డీఎన్ఏ శాంపిల్స్.. ఎవరివో తెలుసా ?

Human Remains To Moon : 50 ఏళ్ల  సుదీర్ఘ గ్యాప్ తర్వాత తొలిసారిగా అమెరికా చందమామ వైపుగా సోమవారం రోజు ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’ను ప్రయోగించింది.

  • By Pasha Published Date - 08:35 AM, Tue - 9 January 24
  • daily-hunt
Human Remains To Moon
Human Remains To Moon

Human Remains To Moon : 50 ఏళ్ల  సుదీర్ఘ గ్యాప్ తర్వాత తొలిసారిగా అమెరికా చందమామ వైపుగా సోమవారం రోజు ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’ను ప్రయోగించింది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ల్యాండర్ తనతో పాటు తీసుకెళ్తున్న వస్తువులు, మెటీరియల్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

‘పెరెగ్రైన్ ల్యాండర్‌’‌లో ఏమేం ఉన్నాయి ?

  • ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’ను ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేటు కంపెనీ డెవలప్ చేసింది.
  • ఈ కంపెనీ తరఫున ప్రస్తుతం ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’ మూన్ మిషన్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన శరద్ భాస్కరన్ వ్యవహరిస్తున్నారు.
  • పెరిగ్రీన్‌ ల్యాండర్‌‌ ప్రయోగం కోసం రూ.898 కోట్లతో ఆస్ట్రోబోటిక్‌ కంపెనీతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
  • ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’ జనవరి 8న తన జర్నీని మొదలుపెట్టింది. ఇది ఫిబ్రవరి 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం ఉంది.
  • ఇది చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయితే 52 సంవత్సరాల తర్వాత మరోసారి చంద్రునిపైకి అమెరికా అడుగుమోపినట్టు అవుతుంది.
  • చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత పెరెగ్రైన్ ల్యాండర్ 192 గంటల పాటు పని చేస్తుంది.
  • ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’‌లో 20 పేలోడ్‌లు ఉన్నాయి. వీటిలో 5 నాసాకు చెందినవి, మిగిలిన 15 పేలోడ్‌లు వేర్వేరు ప్రైవేట్ కంపెనీలవి.
  • అమెరికాకు చెందిన ఎలిసియం స్పేస్, సెలెస్టిస్ అనే కంపెనీలు చనిపోయినవారి చితాభస్మం, అస్థికలను చంద్రుడిపైకి పంపించే సేవలను అందిస్తుంటాయి.
  • ఇవి ఒక వ్యక్తి చితాభస్మం, అస్థికలను చంద్రుడిపైకి పంపేందుకు రూ.8 లక్షల దాకా వసూలు చేస్తాయి.
  • ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’‌.. పలువురు ప్రముఖుల చితాభస్మం,  అస్థికలతో పాటు వందలాది మంది డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా చంద్రుడిపైకి తీసుకెళ్తోంది.
  • ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’‌ ఇప్పుడు  మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, డ్వైట్ ఐసెన్‌హోవర్, జాన్ ఎఫ్. కెన్నెడీల డీఎన్ఏ నమూనాలను కూడా చంద్రుడిపైకి తీసుకెళ్తోంది.  మొత్తంగా 265 మంది DNA శాంపిల్స్‌ను చంద్రుడిపై ‘పెరెగ్రైన్ ల్యాండర్‌’‌ దింపనుంది.
  • ప్రముఖ వ్యోమగామి ఫిలిప్ చాప్‌మన్ DNA నమూనాలను కూడా ఈ ల్యాండర్ తీసుకెళ్తోంది. ఈయన ఎవరంటే.. చాలా ఏళ్ల క్రితం చివరి విడత అపోలో మిషన్ కింద చంద్రునిపైకి పంపేందుకు చాప్‌మన్‌ను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో ఆ మిషన్ ప్రారంభించబడలేదు. చాప్‌మన్  2021లో చనిపోయారు. దీంతో చంద్రుడిపైకి వెళ్లాలనే ఆయన కోరికను ఇలా(Human Remains To Moon) నెరవేరుస్తున్నారు.

Also Read:  7000 Crores – 3 Days : ఒకేచోట 3 రోజుల్లో రూ.7వేల కోట్ల లగ్జరీ ఫ్లాట్లు కొనేశారు

ఈ ప్రయోగం సక్సెస్ అయితే..

ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రుడిపైకి అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా ఆస్ట్రోబోటిక్‌ నిలువనుంది. అయితే, అంతకంటే ముందుగానే మరో కంపెనీ ఈ ఘనత సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ కంపెనీ త్వరలోనే మరో ల్యాండర్‌‌ను ప్రయోగించనుంది. ఇది చంద్రుడిపైకి నేరుగా మరో షార్ట్ కట్ రూట్‌లో వెళ్లనుంది. ఇవాళ ప్రయోగించిన పెరిగ్రీన్‌ ల్యాండర్‌ మాత్రం కక్ష్యలన్నీ తిరుగుతూ చంద్రుడికి చేరుతుంది. ఇక ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన నోవా-సి ల్యాండర్‌ను ఫిబ్రవరి ఆరంభంలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. కేవలం వారంలోనే చంద్రుడిపైకి అడుగుపెట్టేలా ఈ ప్రయోగం జరగనుండటం విశేషం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Astrobotic Technology
  • Human Remains To Moon
  • Moon Lander
  • nasa
  • Sharad Bhaskaran
  • us

Related News

Trump Is Dead

Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd