Russia-Ukraine conflict: భారత్ పెద్దన్న పాత్ర
రష్యా ప్రత్యేక సైనిక చర్యను భారత్ తప్పుబడుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధవాతావరణం సమసిపోవాలని కోరుకుంటోంది.
- By CS Rao Published Date - 12:47 PM, Thu - 24 February 22
రష్యా ప్రత్యేక సైనిక చర్యను భారత్ తప్పుబడుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధవాతావరణం సమసిపోవాలని కోరుకుంటోంది. పెను సంక్షోభానికి శతృత్వం వెళ్లకూడదని భావిస్తోంది. శాంతిని దెబ్బతీసేలా ఇరు దేశాలు వ్యవహరించడం ప్రపంచానికి మంచిది కాదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి హితవు పలికాడు. తూర్పు ఉక్రెయిన్లో గురువారం సైనిక చర్య ను రష్యా ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం పెను సంక్షోభానికి దారితీస్తుందని, ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీయవచ్చని భారత్ హెచ్చరించింది.
All those who are travelling to Kyiv, incl those travelling from western parts of Kyiv, are advised to return to their respective cities temporarily, especially towards safer places along the western bordering countries: Embassy of India in Kyiv, Ukraine #RussiaUkraineConflict pic.twitter.com/QAxAdK0FQ4
— ANI (@ANI) February 24, 2022
ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుందని మూర్తి వెల్లడించాడు. దొనేత్సక్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలు బహిరంగంగా రష్యా వైపు నిలవడాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో మూర్తి ప్రస్తావించాడు. అంతర్జాతీయ సమాజం ఇచ్చిన పిలుపును ఇరు దేశాలు పట్టించుకోలేదని తిరుమూర్తి గుర్తు చేశాడు. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రతను తగ్గించాలని భారత్ కోరుకుంటోన్న విషయాన్ని వెల్లడించాడు.
వేర్పాటువాద డాన్బాస్ (డొనెట్స్క్ మరియు లుహాన్స్క్) ప్రాంతాన్ని రక్షించేందుకే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తెల్లవారుజామున ప్రత్యేక సైనిక ఆపరేషన్ కు ఆదేశించాడు. ఆ మేరకు రష్యా వార్తా సంస్థ TASS పేర్కొంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని భావించడం లేదని పుతిన్ చెప్పినప్పటికీ పుతిన్ వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం విశ్వసించడంలేదు.
Police officers inspect the remains of a missile that fell in the street, after Russian President Vladimir Putin authorized a military operation in eastern Ukraine, in Kyiv
(Source: Reuters) pic.twitter.com/SpOsBBvPlF
— ANI (@ANI) February 24, 2022
పుతిన్ ఈ ఆపరేషన్ను ఎంతవరకు చేపట్టాలనుకుంటున్నారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాత్రం సైనిక చర్యను “ప్రేరేపిత మరియు అన్యాయమైన దాడిగా పేర్కొన్నాడు. ప్రపంచం రష్యాను జవాబుదారీగా ఉంచుతుందని హెచ్చరించాడు. ఈ వివాదం ఇప్పుడు ఆగిపోవాలి అంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్వీట్ చేశారు, ” ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉక్రెయిన్పై రష్యా యొక్క “నిర్లక్ష్యంగా మరియు రెచ్చగొట్టని దాడిని” ఖండించారు. ఇది “లెక్కలేనన్ని పౌరుల జీవితాలను” ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. “పదేపదే హెచ్చరికలు మరియు దౌత్యంలో నిమగ్నమవ్వడానికి అవిశ్రాంత ప్రయత్నాలు” ఉన్నప్పటికీ రష్యా సార్వభౌమాధికారం మరియు స్వతంత్ర దేశంపై దురాక్రమణ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్టోల్టెన్బర్గ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని ఆపాలని భారత్ కోరుకుంటోంది.
Related News
Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు.