HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Everyone Should Be Vigilant Against The Tricks Of Criminals Cm Chandrababu

TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు..

  • By Latha Suma Published Date - 12:56 PM, Wed - 28 May 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలమైన సందేశాలను ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చినవాళ్లు పోయే వాళ్లే అయినా, నిజమైన కార్యకర్త ఎప్పటికీ పార్టీతోనే ఉంటాడని స్పష్టం చేశారు. పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు.. వారు పార్టీ సిద్ధాంతాలకు నిజంగా నమ్మకంగా ఉన్నారా? అనే విషయమే ముఖ్యం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపిస్తాం: ఎంఎన్‌ఎం ప్రకటన

అలాగే పార్టీకి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కొంతమంది కోవర్టుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేరస్థులూ ఖబడ్దార్‌.. నా దగ్గర ఎవరి ఆటలూ సాగవు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నా. వారిచేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కోవర్టులను పార్టీలోకి పంపాలని చూసే ప్రయత్నాలు సాగుతున్నా, అలాంటి వాళ్లకు ఇకపైన చోటు ఉండదు’’ అని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియా దుష్ప్రచారాలపై కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఇదే చివరి రోజు అవుతుంది. సోషల్‌ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. మహిళల పట్ల గౌరవం ఉండాలి. అది లేకపోతే ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని తేల్చి చెప్పారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను మోసం చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాపై నెపం వేసేందుకు కుట్ర చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం చేశారు. ఆ వార్తను నమ్మేశా. కానీ సాయంత్రానికి నిజం బయటపడింది.  గొడ్డలితో దాడి చేసిన విషయం తెలిసింది. ఇంతటి ఘోరమైన హత్యను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం చాలా దుర్మార్గం’’ అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీలో నిజాయితీ, అంకితభావం కలిగిన వారికే గౌరవం ఉంటుందని, అవినీతి, కుట్రలతో పార్టీలోకి వచ్చేవారికి తలుపులు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. తాను సీఎం అయిన తర్వాత చేస్తున్న మార్పులు, పాలనను ప్రశంసిస్తూ ప్రజల మద్దతుతోనే తాను అధికారంలోకి వచ్చానని తెలిపారు.

Read Also: Kalvakuntla Kavitha: కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ట్రై చేశారా ? ఏం జరిగింది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • mahanadu second day
  • tdp mahanadu
  • Vivekananda Reddy murder case

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd