HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Effect Of Indus Water Stoppage Pakistans Dams Drying Up Irrigation Water Crisis Severe Impact On Kharif

Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!

ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్‌లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి ఈ డ్యామ్‌లు ముఖ్యమైన నీటి వనరులుగా ఉన్న నేపథ్యంలో, వాటిలో నీటి మోతాదులు సగానికి తగ్గిపోవడాన్ని పాకిస్థాన్ అధికారులు ఆందోళనతో గమనిస్తున్నారు.

  • By Latha Suma Published Date - 11:29 AM, Mon - 2 June 25
  • daily-hunt
Effect of Indus water stoppage.. Pakistan's dams drying up.. Irrigation water crisis, severe impact on Kharif..!
Effect of Indus water stoppage.. Pakistan's dams drying up.. Irrigation water crisis, severe impact on Kharif..!

Indus Waters Treaty : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతోంది. ఇటీవలి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, గతంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. 1960లో ఇరు దేశాల మధ్య నెహ్రూ-అయూబ్ ఖాన్ నేతృత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమల్లో మార్పులు రావడంతో పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్‌లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి ఈ డ్యామ్‌లు ముఖ్యమైన నీటి వనరులుగా ఉన్న నేపథ్యంలో, వాటిలో నీటి మోతాదులు సగానికి తగ్గిపోవడాన్ని పాకిస్థాన్ అధికారులు ఆందోళనతో గమనిస్తున్నారు. సింధు నదీ వ్యవస్థ అథారిటీ (IRSA) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా నీటి ప్రవాహంలో సగటు 21% తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడంతో ఖరీఫ్ పంటల సాగుపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Read Also: Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్

ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గంభీరంగా స్పందించారు. తాజాగా తజికిస్థాన్‌లోని దుషాన్‌బే నగరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి హిమానీనదాల పరిరక్షణ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత్ చర్యల వల్ల తమ వ్యవసాయరంగం మరియు ప్రజల జీవనాధారం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ ఆరోపణలను భారత్ స్పష్టంగా ఖండించింది. అదే వేదికపై భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. ఒప్పంద ఉల్లంఘనకు అసలైన కారణం పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమేనని ధ్వజమెత్తారు. “పాక్ ఈ వేదికను దుర్వినియోగం చేయాలని ప్రయత్నించింది. ఇది బాధ్యతారాహిత్యంగా సాగించిన వ్యాఖ్య. భారత్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం,” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య భారత్ యొక్క తాజా నీటి వ్యూహం, పాకిస్థాన్‌పై మానవీయంగా కాకుండా వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవడంలో కీలకంగా మారింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indus Waters Treaty
  • Mangla Dam
  • Pakistan water crisis
  • shehbaz sharif
  • Tarbela Dam

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd