Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.
- Author : Latha Suma
Date : 25-11-2024 - 12:56 IST
Published By : Hashtagu Telugu Desk
Parliament Sessions : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మొదట నిమిషాల పాటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ప్రతిపక్షాల గందరగోళంతో బుధవారానికి సభలు వాయిదా పడ్డాయి. కాగా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ అవినీతి అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోందని ఖర్గే అన్నారు.
అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా నిలుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దీంతో అదానీపై అంశంపై విపక్షాలు సైతం చర్చకు పట్టుపట్టాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు. కాగా, డిసెంబర్ 20వ తేదీ వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ తన మీడియా ప్రసంగంలో, పార్లమెంటులో తరచూ అంతరాయాలను విమర్శించారు. ఓటర్లు పదేపదే తిరస్కరిస్తున్న వాటిని ప్రతిబింబించాలని పేర్కొన్నారు. గత చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేసి సభను సక్రమంగా నిర్వహించేందుకు వీలు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. అనేక సార్లు ఎన్నికల తిరస్కరణను ఎదుర్కొన్న వ్యక్తులు తమ రాజకీయ అజెండాల కోసం కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఎత్తి చూపారు. “ఈ వ్యక్తులు, తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, గందరగోళాన్ని సృష్టించి, సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారు” అని మోడీ అన్నారు. అటువంటి వ్యక్తులు ప్రజల అంచనాలను అందుకోలేకపోయారని, ఇది స్థిరమైన ఎన్నికల శిక్షకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. “అయినప్పటికీ, ఈ పదేపదే తిరస్కరణల నుండి నేర్చుకునే బదులు, వారు సభకు అంతరాయం కలిగించడంలో పట్టుదలతో ఉన్నారు. తద్వారా చాలా మంది అర్హతగల మరియు అర్హులైన సభ్యులకు, ముఖ్యంగా యువకులకు, అర్ధవంతమైన చర్చలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు” అని సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు ప్రధాని మోడీ తెలిపారు.