HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Pensioners December Pension To Be Disbursed A Day Early

AP Pensioners: అవ్వా తాతలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల పెన్షన్ ఒక రోజు ముందే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పింఛన్ పంపిణీకి చిన్న మార్పు చేసింది. డిసెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో, పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 12:54 PM, Mon - 25 November 24
  • daily-hunt
Ap Pensioners
Ap Pensioners

AP Pensioners: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల పింఛన్‌ను ఒకరోజు ముందుగానే, నవంబర్ 30వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది. సాధారణంగా, ప్రభుత్వ పంపిణీ ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతుంది. అయితే, ఈ నెల ఒకటో తేదీ ఆదివారం రావడంతో, సెలవుదినం అవడంతో పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ తీసుకునే వారు ఈ మార్పును గమనించాల్సిందిగా అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తేదీ సెలవు ఉన్న నెలలో, ముందు నెల చివరి రోజున ఇచ్చి పెన్షన్ దారులు మిగిలితే ప్రస్తుత నేల రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పింఛన్లను పంపిణీ చేయాలని సూచించింది. అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే, మూడవ తేదీ న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాధారణంగా, 1న సెలవు దినం రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతుండటంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అదే విధంగా, పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే, మూడో నెలలో మూడు నెలల పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన ఈ నెల నుంచే అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు.

పింఛన్ కు సంబంధించి కొత్త నిబంధనలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే, వారిని వలసదారులుగా గుర్తించి, పింఛన్ రద్దు చేయనుంది. అయితే, వారు మళ్లీ పింఛన్ కోసం దరఖాస్తు చేస్తే, పింఛన్ మళ్లీ మంజూరు చేయబడుతుంది.

ఇదే కాకుండా, పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే, ఆ మరుసటి నెల నుండి భార్యకు పింఛన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు. పింఛన్ తీసుకునే వ్యక్తి ఆ నెల 15వ తేదీ లోపు మరణిస్తే, వితంతు మహిళకు తదుపరి నెల 1వ తేదీనే పింఛన్ మంజూరు చేస్తారు.

ఈ పింఛన్ మంజూరికోసం, అర్హులు ఆధార్ కార్డు, భర్త మరణ ధ్రువపత్రం, కుల ఆదాయ పత్రాలు అందజేయాలని అధికారులు చెప్పారు. ఈ మేరకు, పింఛన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ రాయితీ:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి, విద్యా సంస్థల్లో, గురుకులాల్లో, లేదా హాస్టల్స్‌లో నివసిస్తూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా తమ సొంత ఊరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి ఉండేది. ఇందుకు విద్యార్థులు సెలవు తీసుకోవాలి మరియు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి ఉండేది.

ఈ సమస్యను గమనించిన ఏపీ ప్రభుత్వం ఇంకో మెరుగైన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి, దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్‌లోనే పింఛన్ డబ్బులు జమ చేయబడతాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయాణ ఖర్చులు, సెలవుల ఇబ్బందుల నుండి ముక్తి పొందగలుగుతారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Pensioners
  • CM Chandrababu
  • Good News To AP Pensioners
  • Kondapalli Srinivas

Related News

Investment In Ap

Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • CM Chandrababu

    CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Stampede In Srikakulam Kasi

    Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

  • Ap House Land Is Now Yours

    AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు

Latest News

  • Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

  • Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

  • TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

  • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd