Telangana: కేసీఆర్ను గద్దె దించేది ఉద్యోగులే
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ నమ్మించి మోసం చెసిండని ఆరోపణలు గుప్పించారు
- By Praveen Aluthuru Published Date - 07:15 AM, Thu - 27 July 23
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడని ఎద్దేవా చేశారామె. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదని చెప్పారు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవార్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడ కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది వైఎస్ షర్మిల.
ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదన్నారు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా అని ప్రశ్నించారు. మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర్ ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: Ileana D’Cruz : ఇలియానా బేబీ బంప్ చూశారా? డెలివరీకి రెడీ..
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ