MP Santhosh Kumar : తెలంగాణ ప్రచారంలో కనిపించని బిఆర్ఎస్ ఎంపీ సంతోష్ ..?
కేసీఆర్ కు నీడలా ఎప్పుడు ఉండే సంతోష్..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనిపించకపోయేసరికి అనేక అనుమానాలు వస్తున్నాయి
- By Sudheer Published Date - 11:27 AM, Mon - 20 November 23
తెలంగాణ ఎన్నికల (TS Polls) పోలింగ్ కు సరిగ్గా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఎంతో కీలకం. ఓటర్లను (Voters) ప్రసన్నం చేసుకోవడం..వారికీ కావాల్సినవన్నీ ముట్టజెప్పడం..ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా..వారి మనసు మారకుండా ఉండేలా చేసుకోవడం..ఇదే క్రమంలో ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించడం..ఇలా ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి చేయాల్సిన..చూసుకోవాల్సిన పనులు.
ఇక ఎన్నికల ప్రచారం లో ముందు నుండి గులాబీ బాస్ (KCR) దూకుడు గానే ఉన్నారు. ఎన్నికలు రాబోతున్నాయని తెలిసే..ముందుగా అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ప్రకటించడమే ఆలస్యం వారిని ప్రచారానికి ముమ్మరం చేసారు. తాను కూడా గతంలో కంటే ఎక్కువగా ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నాడు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రతి రోజు మూడు , నాల్గు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శల వర్షం కురిపిస్తూనే..పదేళ్ల బిఆర్ఎస్ (BRS) అభివృద్ధి చూడండి..అవన్నీ చూసి ఓటు వెయ్యండని కోరుకుంటున్నారు.
మరోపక్క కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harishrao), కవిత (Kavitha) ఇలా కుటుంబ సభ్యులంతా ప్రచారంలో బిజీ గా ఉంటె..ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) మాత్రమే ఎక్కడ కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి , షాక్ కు గురి చేస్తుంది. సంతోష్ కుమార్..నిత్యం కేసీఆర్ (KCR) వెంట ఉంటారనే సంగతి తెలిసిందే. కేసీఆర్ గల్లీకి వెళ్లిన ఢిల్లీకి వెళ్లిన ఆయన వెంట సంతోష్ ఉండాల్సిందే. కేసీఆర్ కు నీడలా ఎప్పుడు ఉండే సంతోష్..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనిపించకపోయేసరికి అనేక అనుమానాలు వస్తున్నాయి.
గత కొద్దీ రోజులుగా కేసీఆర్ కుటుంబంలో పలు గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తుంది. ఆ గొడవలే సంతోష్ ను కేసీఆర్ ను దూరం పెట్టాయని అంటున్నారు. అందుకే సంతోష్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సంతోష్ ను కేసీఆర్ దూరం పెట్టారని..ఆ దూరమే ఆయన్ను ఎన్నికల్లో కనిపించకుండా చేసేయని అంటున్నారు. మరి నిజంగా ఇదేనా..? లేక మరో కారణం ఏదైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి సంతోష్ కుమార్ లేని లోటు ప్రచారంలో కనిపిస్తుంది.
Read Also : KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి
Related News
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.