Whats Today : తెలంగాణ అసెంబ్లీ సెషన్ షురూ.. అమల్లోకి ‘మహాలక్ష్మి పథకం’
Whats Today : తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
- By Pasha Published Date - 07:26 AM, Sat - 9 December 23
Whats Today : తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ తెలంగాణ మంత్రులకు కాంగ్రెస్ సర్కారు శాఖలను కేటాయించనుంది.
- ఈరోజు నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుంది. దీన్ని అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంటుంది.
- ఇవాళ విజయవాడలోని రాయనపాడులో జరిగే వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనానికి హాజరవుతారు.
- ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల నుంచి మళ్లీ నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
- బాపట్ల జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటిస్తారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. తుఫాన్తో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడి, నష్టం వివరాలు తెలుసుకుంటారు.
- విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో జరగనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొంటారు.
- విశాఖలోని సింహాచలం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఇవాళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తారు. విశాలాక్షి నగర్లో వికసిత భారత్ సంకల్ప యాత్రలో(Whats Today) పాల్గొంటారు.
Also Read: Missile -Bapatla : బాపట్ల తీరంలో మిస్సైల్.. ఎక్కడిది ?
Related News
CM Revanth Reddy: మెట్రో నుంచి ఎల్అండ్టీ తప్పుకున్నా పర్లేదు: సీఎం రేవంత్
మెట్రో నుంచి ఎల్అండ్టీ తప్పుకున్నా పర్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్ పథకం ప్రభావం హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టర్బో) వైదొలగాలని భావిస్తుంటే స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.