Double Bedrooms : లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇస్తాం – మంత్రి పొంగులేటి
Double Bedrooms : లబ్ధిదారులు తమకు కేటాయించిన నిధులతో స్వయంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, నిర్మాణ నాణ్యతకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తారు
- Author : Sudheer
Date : 17-06-2025 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ (Double Bedrooms) ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు పూర్తి కాకుండా మిగిలిపోయిన 69 వేల ఇళ్ల నిర్మాణాన్ని పురోగతి చెందించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే, లబ్ధిదారులకే నిర్మాణ బాధ్యత అప్పగించనున్నారు. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షలు నగదు అందజేస్తామని ఆయన ప్రకటించారు.
PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీ
ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకే నేరుగా బాధ్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సమయాన్ని ఆదా చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ నిధుల వినియోగాన్ని సమర్థవంతంగా చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు తమకు కేటాయించిన నిధులతో స్వయంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, నిర్మాణ నాణ్యతకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తారు.
5 Wickets In 5 Balls: టీ20 క్రికెట్లో సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు, వీడియో వైరల్!
అదనంగా రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా గృహహీనులకు స్థిర నివాసం కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గృహ నిధులను ప్రజలకు మరింత సమర్థంగా వినియోగించేందుకు ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తున్నది.