Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి చారిత్రాత్మక స్థాయిలో నమోదైందని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా రానంత మొత్తమని ఆయన తెలిపారు.
- Author : Latha Suma
Date : 29-05-2025 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
Bhatti Vikramarka : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి చారిత్రాత్మక స్థాయిలో నమోదైందని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా రానంత మొత్తమని ఆయన తెలిపారు. ఇంత భారీ దిగుబడిని చూసిన సందర్భం చాలా అరుదు. దీనికి అనుగుణంగా ధాన్య సేకరణ కూడా చురుకుగా కొనసాగుతోంది. సన్న రకాలకు బోనస్ పంపిణీ ప్రక్రియలో ఎక్కడా లోపాలు ఉండకూడదు. ప్రతి రైతుకు న్యాయం జరగాలి అని స్పష్టం చేశారు.
Read Also: Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్న భట్టి విక్రమార్క, ఒక్క తెలంగాణలోనే ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల నిధులు ఇల్లు కట్టుకునేందుకు అందించబడుతున్నాయని వివరించారు. గతంలో బీజేపీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినప్పటికీ, గత పదేళ్లలో ఒక్క కుటుంబానికైనా ఆ సాయం అందలేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఒక్కరూ పక్షపాతానికి గురికాకుండా సరైన ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూభారతి అమలు దశలోకి వేగంగా ప్రవేశిస్తున్నట్టు తెలియజేశారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా రూపొందించేందుకు భూభారతి అనేది కీలక ఆయుధం కానుంది. ఇక ధరణి వ్యవస్థ రద్దు కూడా మేము ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలలో ఒకటి. దాని అమలుకు ముందడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించబడింది. వ్యవసాయం, హౌసింగ్, రెవెన్యూ వంటి విభాగాల పై అధికారుల నుంచి సమగ్ర వివరాలను కోరిన భట్టి విక్రమార్క, అవసరమైన మార్పులు, మెరుగుదలలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షేమం అన్నది మా ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు ప్రజల జీవితాల్లో హచ్చుతుడి మార్పుకు బీజం వేసే మార్గం కూడా. ప్రతి ఒక్క పథకం సరైన లబ్ధిదారుని చేరేలా పని చేయాలి అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Pakistan Nuclear Test : పాక్ అణుపరీక్షల వార్షికోత్సవాల్లో ఉగ్రవాదులు