TSRTC: టిఎస్ఆర్టిసి నిర్ణయంతో నష్టపోతున్న హైదరాబాద్ ఉద్యోగులు
టిఎస్ఆర్టిసి తమ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని 6 శాతం తగ్గిస్తూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిపై భారం పడనుంది
- By Praveen Aluthuru Published Date - 12:13 PM, Sun - 17 March 24
TSRTC: టిఎస్ఆర్టిసి తమ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని 6 శాతం తగ్గిస్తూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిపై భారం పడనుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని టిఎస్ఆర్టిసి ఉద్యోగులు ఇప్పటివరకు 30 శాతం హెచ్ఆర్ఏ పొందారు. ఇప్పుడు 6 శాతం కోతతో వారు 24 శాతం మాత్రమే పొందుతారు. ఇది వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిఎస్ఆర్టిసిలో పనిచేస్తున్న 42,000 మంది ఉద్యోగులలో 20,000 మందికి పైగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్లలో పనిచేస్తున్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, గోదావరిఖని, వరంగల్లో ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్ఏను కూడా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం 3 శాతానికి తగ్గించి, 20 శాతం నుంచి 17 శాతానికి తగ్గించింది.
మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిద్దిపేట, జహీరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, తాండూరు, వనపర్తి, గద్వాలలో పనిచేసే సిబ్బందికి హెచ్ఆర్ఏ 14.5 శాతం నుంచి 13 శాతానికి తగ్గించింది. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, జనగాం, కొత్తగూడెం, మంచిర్యాల, మిగిలిన ప్రాంతాల్లో 12 శాతం నుంచి 11 శాతానికి కుదించింది.
Also Read: Child Born With Tail : చైనాలో తోకతో పుట్టిన పాప.. అద్భుతమంటున్న జనాలు
Tags
Related News
Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టా