TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ
- By Latha Suma Published Date - 04:59 PM, Wed - 6 March 24
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షల తేదీలు..
ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు
నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు
అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. మొత్తం 563 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుంది. పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రిలిమ్స్ పరీక్షను మే-జూన్లో నిర్వహిస్తారు. ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ అప్ జైల్స్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, జిల్లాల పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, డీఎస్పీల సహా మొత్తం 18 విభాగాల్లో 563 పోస్టులు భర్తీ చేయనున్నారు.
read also : NIA: కేఫ్లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్ఐఏ ప్రకటన
అభ్యర్థుల వయోపరిమితిని టీఎస్పీఎస్సీ ఇప్పటికే 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.