Trafic Diversions : నేటి నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
నేటి (జూలై 8) నుంచి 10వ తేదీ వరకు సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా శుక్రవారం
- By Prasad Published Date - 08:38 AM, Sat - 8 July 23
నేటి (జూలై 8) నుంచి 10వ తేదీ వరకు సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కర్బాలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పీఎస్ రామ్గోపాల్పేట, ప్యారడైజ్లోని రోడ్లు, జంక్షన్లను నివారించాలని పోలీసులు కోరారు. CTO, ప్లాజా, SBI X రోడ్, YMCA, X రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ X రోడ్, పాట్నీ X రోడ్, పార్క్ లేన్, బాటా, ఘస్మండి X రోడ్స్, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్పురా వైపు ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు సకాలంలో రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని అభ్యర్థించారు. ప్లాట్ఫారమ్ నంబర్ 1 వైపు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని.. చిలకలగూడ వైపు నుండి స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్ 10 నుండి ప్రవేశాన్ని ఉపయోగించాలని పోలీసులు అభ్యర్థించారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని తెలిపారు.
పొగాకు బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి అన్ని వాహనాల రాకపోకలకు మూసివేయబడుతుందని తెలిపారు. బాటా ఎక్స్ రోడ్ల నుంచి పాత రాంగోపాల్పేట పీఎస్ వరకు సుభాష్ రోడ్డు, ఔడయ్య ఎక్స్ రోడ్స్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి, సికింద్రాబాద్ జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు అన్ని వాహనాల రాకపోకలకు బంద్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నయ మార్గాల్లో రైల్వే స్టేషన్కు వేళ్లేలా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.
Related News
Modi’s Guarantee : నారాయణపేటలో ‘మోడీ గ్యారెంటీ’ల ప్రకటన..
గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని..తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు