DK Aruna: బీజేపీ వీడి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ
బీజేపీ పార్టీ మారి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు.
- Author : Balu J
Date : 26-10-2023 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
DK Aruna: బీజేపీ పార్టీ మారి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రెస్మీట్లో ప్రకటించారు. సోషల్ మీడియాలో పూర్తిగా వ్యాపించే వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలనే మైండ్ గేమ్ ఆడుతున్నారని, తనకు కాంగ్రెస్ పార్టీలో లేదా మరే ఇతర పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఆమె అన్నారు. భాజపా జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసే అదృష్టం తనకు దక్కాలని ఆమె అన్నారు.
కనీసం తన స్పందన కూడా తీసుకోకుండా వార్తలు, కథనాలు రాయడం సరికాదని.. ఇక్కడ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని డీకే అరుణ మండిపడ్డారు.తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై వదంతులు ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపింది.
Also Read: CM KCR: కేసీఆర్ దమ్ము ఏంటో దేశం మొత్తం చూసింది, ప్రతిపక్షాలపై సీఎం ఫైర్