Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!
వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.
- By Balu J Published Date - 04:45 PM, Mon - 17 January 22
వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు. సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. భారీ ఎత్తున నిర్మించి, త్వరలోనే, భారత రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్న శ్రీ రామానుజ ల వారి విగ్రహం మహిమాన్వితమైనది గా నిలిచిపోతుందని అన్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సీఎం కెసిఆర్ గారు సమన్వయం, సహకారంతో అంతే గొప్పగా జరుగుతాయని వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారని అన్నారు. ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వచ్చే అహూతుల కోసం ఆ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, ఇతర ఏర్పాట్లు కూడా ఘనంగా ఉంటాయని మంత్రులు తెలిపారు.
ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణ కు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కానుందని అన్నారు. సీఎం కెసిఆర్ తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణ, పూర్ణో ద్ధరణకు నడుం బిగించారు అని తెలిపారు. యాదాద్రి ని తీర్చిదిద్దుతున్న వైనాన్ని వివరించారు. జీయర్ ట్రస్ట్ ప్రాంగణం లో తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని అభినందించారు. మంత్రులు సంబంధిత అధికారులకు ఏర్పాట్ల విషయమై తగు సూచనలు, సలహాలు చేశారు. పనులు వేగంగా, నాణ్యంగా జరగాలని అదేశించారు.
Related News
Hyderabad: నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు
Hyderabad: SOT శంషాబాద్ టీం మరియు మైలార్దేవ్పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని మెహఫిల్ రెస్టారెంట్లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. గంగరాజా మరియు అభినందన్ లది చిత్తూరు జిల్లా. వీరు ఇద్దరు 500 రూపాయల నోట్ల కట్టలలో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసం చేస్తుంటారని తెలిపారు. వారి వద్దనుండి 6.62 లక్షల విలువ చేస