Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:21 PM, Sat - 24 February 24
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ ని కాపాడుతున్నట్టు ఆయన విమర్శించారు.
ఈరోజు ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ , బీఆర్ఎస్లు తెరవెనుక కుట్రలు, కుటిల రాజకీయాలకు అలవాటు పడ్డాయని ఆరోపించారు. బీజేపీ ఏదైనా బహిరంగంగా మాట్లాడుతుందని చెప్పారు. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు , ధరణిపై సీబీఐతో విచారణ జరిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక అలాంటి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు లక్షణ్. బీజేపీ ఏం చెబితే అదే చేస్తుందని అన్నారు.
17 ఎంపీ స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దింపబోతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Related News
KTR: కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మ తో కూడా కాదు: కేటీఆర్
KTR: తెలంగాణ భవన్ లో జరిగిన ‘మే’ డే వేడుకల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరవలేనిదని, సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ సత్తా చాటారని, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్న