HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Govt Hikes Da For Employees Pensioners By 2 73 Percent

DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది.

  • Author : Gopi Date : 24-01-2023 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Telangana

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు ఎనిమిది వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఉన్న డీఏను 17.29 నుండి  20.02 శాతానికి పెంచింది ప్రభుత్వం,  డీఏ పెంపుతో  4.40 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది.  డీఏ పెంపు కారణంగా  2.38 లక్షల మంది పెన్షనర్లకు  కూడా  ప్రయోజనం  కలగనుంది. ఎనిమిది విడతల్లో ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

సీఎం కేసీఆర్ గారు నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1/2 pic.twitter.com/hZfp10gipA

— Harish Rao Thanneeru (@BRSHarish) January 23, 2023

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4లోగా ప్రక్రియ పూర్తి.. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అనుమతి.. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లోగా అప్పీళ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు సమగ్రంగా చర్చించారు. చర్చలు సఫలం కావడంతో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఖరారు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DA For Pensioners
  • Dearness Allowance
  • employees
  • Pensioners
  • telangana govt

Related News

Shock for Telangana Ration Cardholders

White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..

తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రా

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd