HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Govt Appointment Of Five Thousand Gpos

Telangana Govt: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 5వేల మంది ఎంపిక‌!

మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.

  • Author : Gopichand Date : 04-09-2025 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Govt
Telangana Govt

Telangana Govt: తెలంగాణ (Telangana Govt) రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలను అందించేందుకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా గ్రామ పరిపాలనాధికారుల (GPO) నియామకం చేపట్టి రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి వరకు బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పత్రాల పంపిణీ

సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైటెక్స్‌లో ఐదు వేల మందికి పైగా కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జీపీవోలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వీఆర్వో, వీఆర్ఏలకు రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించి అందులో 5,106 మంది అర్హత సాధించారని వివరించారు. ఈ నియామకాలతో గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆవేదన

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెబితే వినలేదన్న అక్కసుతో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. ఈ చర్య వలన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయి అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా, రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు అందించాలనే లక్ష్యంతోనే గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా చారిత్రాత్మకమైన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

సర్వే విభాగం బలోపేతానికి చర్యలు

మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు. గత పదేళ్లలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, దీనికి అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చే నెల మొదటి వారం నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి విడతలో 7,000 మందికి శిక్షణ, అర్హత పరీక్ష పూర్తయ్యాయని, రెండో విడతలో 3,000 మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభమైందని వివరించారు. ఈ చర్యలన్నీ ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • GPOs
  • hyderabad
  • Minister Ponguleti
  • telangana govt
  • telugu news

Related News

Rajahmundry Airport

రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్ 16 నుంచి కొత్త ఎయిర్‌బస్ సర్వీసులు ప్రారంభం!

Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్‌బస్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఏపీ నుంచి కొ

  • New Year Celebrations Hyder

    New Year Celebrations : ‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

  • Cm Revanth Messi

    Messi & Revanth Match : ఇది మరిచిపోలేని క్షణం – రేవంత్ రెడ్డి

  • Messi Mania

    Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

  • PM Modi Serious

    PM Modi Serious: తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు ప్ర‌ధాని మోదీ వార్నింగ్‌!

Latest News

  • నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!

  • ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

  • రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

  • ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Trending News

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd