Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
- Author : Gopichand
Date : 26-06-2025 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
Employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు (Employees), పెన్షనర్లకు శుభవార్త అందించింది. గతంలో పెండింగ్లో ఉన్న రూ. 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి క్లియర్ చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది. ఈ చర్య ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల ఒత్తిడి మధ్య కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను సూచిస్తోంది.
గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు క్లియర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ నిధుల విడుదలతో వైద్య ఖర్చుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గనుంది. “ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం ద్వారా వారికి న్యాయం చేశాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Railway Track: రైలు పట్టాలపై కారు పరుగులు… 7 కిలోమీటర్ల హల్చల్తో రైళ్ల రాకపోకలకు బ్రేక్!
ప్రజల స్పందన
ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. “గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడికల్ బిల్లులను క్లియర్ చేయడం స్వాగతించదగిన చర్య. ఇది ఉద్యోగులకు గొప్ప ఊరటనిస్తుంది” అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఒకరు తెలిపారు. అయితే X వేదికగా కొందరు ఈ చర్య ఆలస్యమైందని, ఇంకా పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నారు.