HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Finally Working On Increasing Aasara Pensions

ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు

  • Author : Sudheer Date : 05-01-2026 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aasara Pension
Aasara Pension

తెలంగాణ లో అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఆసరా పింఛన్లను పెంచలేదని అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ, ఎట్టకేలకు ప్రభుత్వం పింఛన్ల పెంపుపై కసరత్తులు మొదలుపెట్టింది. తాజాగా హైదరాబాద్ మలక్‌పేటలో గల దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయీస్‌ బ్రెయిలీ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్లో మాట్లాడగా.. త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అంధ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా.. దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే దివ్యాగులకు రూ.6000 పెన్షన్ అందజేస్తామని తెలిపారు.

తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు. అయితే ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 4,016 అందుతుండగా.. వృద్ధులు, ఇతరులకు రూ. 2,016 పింఛనుగా ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం.. దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న రూ. 4,016 ను రూ. 6,000 కు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత.. దశలవారీగా మిగిలిన వారికి పెంచిన పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Aasara Pension Increase

Aasara Pension Increase

దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాలని కూడా నిర్ణయించారు. పదో తరగతి వరకే ఉన్న బ్రెయిలీ లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విస్తరించడం ద్వారా అంధ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛన్ల పెంపుతో పాటు… అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aasara Pension
  • aasara pension increase
  • Adluri Laxman Kumar
  • cm revanth
  • Congress Govt
  • telangana

Related News

Municipal Elections In Tela

తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసిన వెనువెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది

  • Telangana Municipal Elections

    Breaking News : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రెడీ .. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • CM Revanth Reddy

    స్టూడెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి

  • మెస్సే మ్యూనిచెన్ ఇండియాతో కలిసి బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026

Trending News

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

    • ఆర్జే మహవష్‌తో విడిపోయిన చాహ‌ల్‌.. కార‌ణం ఏంటంటే?

    • India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd