Telangana Asara: కేసీఆర్ సారూ.. మాకేదీ ఆసరా!
32 ఏళ్ల అలివేలు మంగ ఓ నిరుపేద మహిళ. ఎలాంటి జీవనాధారం లేని ఆమె పింఛను కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు కావస్తున్నా.. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు.
- By Balu J Published Date - 11:00 PM, Thu - 17 February 22
32 ఏళ్ల అలివేలు మంగ ఓ నిరుపేద మహిళ. ఎలాంటి జీవనాధారం లేని ఆమె పింఛను కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు కావస్తున్నా.. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో నివాసముంటున్న మంగ తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పోషించుకుంటున్న దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆరు నెలల క్రితం కోవిడ్-19 బారిన పడిన తర్వాత, ఆమె ఉద్యోగం కూడా కోల్పోయింది. ఆసరా పెన్షన్ పథకం కింద వితంతువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే నామమాత్రపు రూ. 2,000తో కొంత సహాయం పొందాలని ఆమె ఆశించింది. కానీ ఫలితం లేకుండా పోయింది.
“ఏ ఆధారం లేని ఆమెకు ఫించన్ కొంతనైనా ఉపయోగపడుతంది. ఉద్యోగం లేక, ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగించడం కష్టంగా మారింది. ఇతరుల పెన్షన్ స్టేటస్ వివిధ దశల్లో పెండింగ్లో ఉండగా.. ఈమే దరఖాస్తును అధికారులు పరిశీలించి ఒకే చేశారు. కానీ నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. ఎంతసేపు వేచి ఉండాలో తెలియడం లేదు’’ అని మంగ విలపిస్తోంది.
ఆగస్ట్ 2019లో మంగ తన భర్తను కోల్పోయింది. ఆమె వెంటనే ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసింది. పథకం ప్రకారం, వితంతువులకు నెలకు రూ. 2,000 పెన్షన్ లభిస్తుంది. పింఛనుకు అర్హులైన వారిలో వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఫైలేరియా రోగులు, హెచ్ఐవీ రోగులు, వృద్ధులు మరియు నేత కార్మికులు ఉన్నారు. మంగ బతకలేక స్వగ్రామానికి వెళ్లి తల్లి ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమె గతంలో నెలకు రూ. 10,000 జీతం అందించే డేటా ఆపరేటర్గా పనిచేసింది.
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల నాగపురి మహేశ్వరి, వితంతువు, “నా భర్త 2020 మార్చిలో చనిపోయాడు, తరువాత నెలలో నేను పింఛను కోసం దరఖాస్తు చేసాను, కాని నాకు డబ్బు రాలేదు. పంపిణీలో జాప్యానికి కరోనా కారణమని అధికారులు పేర్కొంటున్నారు. వారిని పదే పదే అడగడం వల్ల నేను విసిగిపోయాను. మంగ, మహేశ్వరిలాగే లక్షలాది మంది లబ్ధిదారులు 2020 నుంచి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 2020లో ఆసరా పథకం కింద దరఖాస్తుదారుల వయస్సు ప్రమాణాలను మార్చింది. దరఖాస్తు చేసే సమయంలో 57 ఏళ్లు నిండిన వ్యక్తులకు కూడా పొడిగించింది. మునుపటి పరిమితి 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు, ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. వివిధ వర్గాల కింద ఉపశమనం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
”లబ్దిదారులను గుర్తించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా ఉపశమనం కల్పించలేదు. 2020లో అర్హత ప్రమాణాలలో మార్పులు చేసినందున, చాలా మందికి పెన్షన్ రాలేదు. ఇది వితంతువులను ఎక్కువగా ప్రభావితం చేసింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 75,000 కుటుంబాలకు రైతుబీమా (రైతు బీమా) అందించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది, అయితే వాస్తవమేమిటంటే ఆ కుటుంబాలకు కూడా పింఛను నిరాకరించారు’’ అని వ్యవసాయ ఉద్యమకారుడు బి కొండల్రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన రైతు హక్కుల సంస్థ రైతు స్వరాజ్య వేదిక సభ్యుడు.
తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతు బీమాను ప్రవేశపెట్టింది, ఇక్కడ ప్రభుత్వం రైతుకు రూ. 5 లక్షల బీమా కవరేజీని అందించింది. అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం వితంతువులకు ఇచ్చే పింఛన్లను నిలిపివేసిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రైతు బీమాను ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం జీవో 173ను ఉల్లంఘిస్తోందని, దాని ప్రకారం పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పునరావాస ప్యాకేజీలో భాగంగా రూ.6 లక్షల పరిహారం అందజేస్తోందని ఆరోపించారు. అధికారుల లెక్కల ప్రకారం ఇంకా 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను అందలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 39,36,521 మంది పింఛను పొందుతున్నారు. 2021లో తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ కోసం రూ.11,728 కోట్లు కేటాయించింది. కానీ ఆ మొత్తాన్ని విడుదల చేయలేదు.
నోట్ : ఈ స్టోరీకి సంబంధించిన ఫొటో ఫైల్ ఫొటో.. గమనించగలరు
Related News
Telangana Govt : మే 13, జూన్ 4న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Lok Sabha Election: లోక్సభ ఎన్నిలక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఈనెల 13 సెలవు(holiday) ప్రకటించింది. ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ 13న జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల కౌంటింగ్ రోజు అయిన జూన్ 4న కూడా ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది. మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. We’re now on WhatsApp. Click […]