HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Congress On Kcr And Paddy Issue

Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు

కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.

  • By Siddartha Kallepelly Published Date - 12:18 AM, Thu - 23 December 21
  • daily-hunt
Tpcc
Tpcc

కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు. సునీల్ ఎవరో, అమిత్ షాకు సంబంధమేంటి, గతంలో ఎవరితో కలిసి పని చేశాడనే వివరాలు త్వరలోనే వివరాలు బయటపెడతానని రేవంత్ తెలిపారు. కేసీఆర్ వ్యూహకర్త సునీల్ సూచనల మేరకు టీఆర్ఎస్, బీజేపీ వడ్ల కొనుగోలు అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ వ్యూహకర్తల చక్రబంధంలో, టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయకుండా పారిపోయిన టీఆర్ఎస్ ఎంపీలు మళ్లీ ఢిల్లీకి వచ్చి నాటకాలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు. రాజకీయ స్వార్థం, ప్రయోజనం కోసం అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ డ్రామాను కాంగ్రెస్, కిసాన్ సెల్ ఆధ్వర్యంలో “రైతులతో రచ్చ బండ” పేరుతో ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు.

ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అసమర్థత కారణంగా ఖరీఫ్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కొనుగోలు, రవాణా, ఐకేపీ కేంద్రాల ఏర్పాటులోనూ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంట తడిసిపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని, ఇందుకు కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. పోయిన రబీ సీజన్ లో 52 లక్షల ఎకరాల్లో వరి పండించామని చెబుతూనే, ఈ సారి వరి అసలే వేయొద్దని చెప్పడం తుగ్లక్ చర్య అని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరిపై ఆంక్షలు విధించకుండా వరి ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణాలో
రైతులకు ఎక్కడా మద్దతు ధర లభించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ధాన్యం సేకరించాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. హంగు, ఆర్భాటాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ రైతుల కోసం రెండు, మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించలేరా అని ఎంపీకోమటిరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత. సీఎం కేసీఆరే తీసుకోవాలని కోమటి రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇప్పించామని టీఆర్ఎస్ వచ్చాక రైతులను నాశనం చేస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • komati reddy venkat reddy
  • paddy issue
  • paddy procurement
  • revanth reddy
  • telangana congress
  • telangana farmers
  • uttam kumar reddy

Related News

Raghunandan Rao

Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

  • PCC Chief Mahesh Goud's response on Kavitha's suspension

    Telangana : కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందన

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్

  • Uttam Tg

    TG Assembly Session : రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా – మంత్రి ఉత్తమ్

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd