HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Congress Manifesto

Telangana Congress Manifesto : కుంభస్థలాన్ని కొట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో

ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) మొదటి రెండు అంశాలలోనే కేసిఆర్ మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కీలకమైన బాణాన్ని ఎక్కు పెట్టింది.

  • Author : Hashtag U Date : 18-11-2023 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Congress Manifesto
Telangana Congress Manifesto

By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress Manifesto : తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని కేసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, చరిత్రను ఎంత తిరగదోడినా, కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని ఆరోపణలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో తన పంథాలో తాను ముందుకు దూసుకుపోతోంది. తమ పార్టీ చేసిన ఆరు పథకాల వాగ్దానంతో పాటు 66 కీలకంశాలను జోడించి, 42 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) మొదటి రెండు అంశాలలోనే కేసిఆర్ మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కీలకమైన బాణాన్ని ఎక్కు పెట్టింది. ప్రజాస్వామ్య పాలన, ప్రతిరోజూ ప్రజా దర్బారు అనే వాగ్దానంతో ఎన్నికల మేనిఫెస్టో మొదలవుతుంది. కేసీఆర్ మీద ప్రజలలోను, నాయకులలోను నిరంతరం వ్యక్తమయ్యే అసంతృప్తి ఒకటే. కేసిఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరనేదే ఆ అసంతృప్తి. తమ సమస్యలు విన్నవించుకోవడానికి, తమ గోడు వెల్లడించుకోవడానికి రాజుగారు ప్రజలకు అందుబాటులో లేకుంటే ప్రజల గోడు పట్టించుకునే నాధులు ఎవరు? ఈ విషయంలో కేసీఆర్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఆయువుపట్టు లాంటి ఆ పాయింట్ మీదే కాంగ్రెస్ మేనిఫెస్టో (Manifesto)లో మొదటి వాక్యంలో మొదటి అంశంతోనే దెబ్బ కొట్టింది.

We’re Now on WhatsApp. Click to Join.

ప్రతిరోజూ ప్రజాదర్బార్ ఉంటుందని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అంతేకాదు, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఈమధ్య ప్రతి ఎన్నికల సభలోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని, మొదటిసారి ఉద్యమంలోనూ రెండోసారి ఉద్యమంలోనూ వందలాదిమంది తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే (Telangana Congress) అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, మహోధృతంగా ఉద్యమం పైకి లేచిన సందర్భంలో ఇక మరో గత్యంతరం లేక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పూనుకుందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వారే కాదు మరోవైపు బిజెపి కూడా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ఉద్యమకారులను చంపించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో ఎంఐఎం కూడా తక్కువ తినలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ సాధన కోసం అమరులైన వారి మీద కేసులన్నీ ఎత్తివేస్తామని, అమరవీరుల ప్రతి కుటుంబానికీ 250 గజాల స్థలాన్ని ఇస్తామని, వారికి పెన్షన్ లాంటి మరిన్ని సదుపాయాలు కలుగ చేస్తామని వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం చాలా కీలకమైంది. తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పినా, అది అమలు జరగలేదన్న అసంతృప్తి వేలాది కుటుంబాల్లో నెలకొని ఉంది.

తెలంగాణ తెచ్చింది మేమేనని ఎన్ని మాటలు చెప్పుకుంటున్నా, ఆచరణలో అమరవీరుల కుటుంబాలకు చేసింది ఏమీ లేదని, అధికారంలోకి వస్తే తామే ఆ కుటుంబాలను ఆదుకుంటామని, ఇది కేవలం వాగ్దానం కాదని, ఏ విధంగా ఎలా ఆదుకుంటారో కూడా వివరంగా ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. ఇది కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఖంగు తినిపించే విషయమే. చరిత్రలో ఏం జరిగిందో చెప్పుకుంటూ పోతే కాదు, ఇప్పుడు ఆచరణలో ఏం చేస్తామో, చేశామో అనేదే ముఖ్యం.

Telangana Congress Manifesto New 17 Nov 2023

Telangana Congress Manifesto Leaflet PDF

ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ (Telangana Congress) స్పష్టమైన వాగ్దానం:

గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు అసలైన కారణం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదనే అంశమే. ఈ అంశం మీద కాంగ్రెస్, మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన వాగ్దానంతో ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో నోటిఫికేషన్లు రావడం, అవి రద్దు కావడం, పరీక్షలు జరగడం అవి రద్దు కావడం, వాయిదాల మీద వాయిదాలు పడడం, ఇలా ఏళ్ల తరబడి యువత భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ విషయంలో తెలంగాణ మొత్తం యువత గుండెల్లో కోపాగ్ని సెగలు రగులుకుంటున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తామని కేవలం వాగ్దానం చేయడమే కాకుండా, ఈ మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసింది. ఏయే తేదీల్లో డీఎస్సీ, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తారో, ఏ తేదీల్లో నియామకాలు నిర్వహిస్తారో సవివరంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి రాకముందే ఇలా తిధులు నక్షత్రాలతో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేయడం విచిత్రంగా ఉందని అధికారంలో ఉన్నవారు అవహేళన చేయవచ్చు. కానీ అధికారంలో ఉండగా ఆ పార్టీ వారు చేయని పనులను ఇదిగో మేము చేస్తామని మాకు ఒక రూట్ మ్యాప్ ఈ విషయంలో స్పష్టంగా ఉందని తెలియజేయడానికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ విధమైన తేదీల వారీగా వాగ్దానం చేసింది.

దీంతోపాటు కీలకమైన ధరణి పోర్టల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన వాగ్దానం కనిపించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, అలాగే రైతులకు మూడు లక్షల దాకా వడ్డీ లేని రుణ సదుపాయం అంటూ మరో కీలకమైన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇది కూడా బీఆర్ఎస్ చెబుతున్న రైతుబంధు పథకానికి మెరుగైన ప్రత్యామ్నాయ వాగ్దానంగా ప్రజల ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ యోచనగా కనిపిస్తోంది. ధరణి పోర్టల్ లో ఉన్న అవకతవకలను తొలగించి ‘భూమాత’ పేరు మీద ఒక వ్యవస్థను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. ధరణి పోర్టల్ రద్దు చేస్తారని, మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థను కాంగ్రెస్ వారు తిరిగి తీసుకొస్తారని కేసిఆర్ చేస్తున్న విమర్శను తిప్పి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ భూమాత వ్యవస్థను ప్రజలకు వాగ్దానం చేసింది.

ఇలా పథకాలు, వాటి అమలు తీరుతెన్నులు విషయంలో తమకు ఎంత స్పష్టత ఉందో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా తెలియజేసింది. ఇంకా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తదితర అంశాలతో కూడిన వాగ్దానాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మొత్తం మీద ఎక్కడెక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ లోపాల లోయల్లో కూరుకుపోయిందో అక్కడక్కడ స్పష్టమైన పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు నిలవడానికి కఠినమైన పరిశ్రమతో ఈ మేనిఫెస్టో తీసుకు వచ్చినట్లు అర్థమవుతుంది. చూడాలి.

మేనిఫెస్టో ప్రకటించడం వేరు ఆచరణలో అమలు చేయడం వేరు. ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలు లాంటివని ప్రజలు ఇప్పటికే తమ అనుభవంతో అనుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ వాగ్దానాలన్నీ అమలు చేస్తుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈ వాగ్దానాలను ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే విషయం మాత్రం డిసెంబర్ 3వ తేదీనే అర్థమవుతుంది.

Also Read:  కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బాలకిషన్ యాదవ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • INC
  • manifesto
  • rahul gandhi
  • revanth reddy
  • TCongress
  • telangana
  • telangana congress

Related News

Special Trains Sankranti 20

దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains :  సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.   సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్ తెలంగాణ ఏపీ మధ్య 16 స్పెషల్ ట్ర

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Bosch Sports Meet

    ఘ‌నంగా ముగిసిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ క్రీడా వేడుకలు

  • Australia

    ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

  • Esic Hospital

    తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Latest News

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd