Addanki Dayakar : ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది
Addanki Dayakar : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.
- By Kavya Krishna Published Date - 01:06 PM, Sun - 5 January 25

Addanki Dayakar : రైతు భరోసా పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.
హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకుల విమర్శలపై స్పందిస్తూ, ఈ నాయకులు విమర్శలకు తప్ప దేనికి పనికి రారని ప్రజలకు అర్థం అయిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులకు గడ్డు రోజులే కలిగించాయని ఆయన విమర్శించారు.
Nara Lokesh : గంటలోనే సమస్యను తీర్చిన నారా లోకేష్..దటీజ్ లోకేష్
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం లో రైతు రుణమాఫీ, రైతు భరోసా అందించి చరిత్రలో ముద్ర వేసిందని అద్దంకి దయాకర్ చెప్పారు. ఆయన వివరణ ప్రకారం, రైతుల పట్ల రేవంత్ రెడ్డి చేసిన కమిట్మెంట్ వాస్తవంగా ప్రకటనల్లో మాత్రమే కాకుండా, ఆమలు చూపించినట్లు కూడా నిరూపితమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టిందని, వీటిలో అన్ని పంటలకు బోనస్, రైతు భీమా, నష్టపరిహారం వంటి పథకాలు ముఖ్యంగా ఉన్నాయన్నారు అద్దంకి దయాకర్. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీలకు రైతులను గోసపెట్టిన చరిత్ర ఉన్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజల నుండి ధనాన్ని దోచుకున్నాయని దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని, ముఖ్యంగా, చెట్లకు, పుట్టలకు, ఫిల్మ్ సిటీలకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పక్షాల విమర్శలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తమకి తగిన బుద్ధిచెబుతారని అద్దంకి దయాకర్ జోస్యం చెప్పారు. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతి పక్షాలు విమర్శలు చేయడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల తన విధానాలను మరింత సమర్ధవంతంగా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!