TPCC : కాంగ్రెస్ శిక్షణా తరగతులు.. రేవంత్ రెడ్డి స్పీచ్ 5 పాయింట్స్
నగరంలోని కోంపల్లి ఆస్పైసియాస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
- By Balu J Published Date - 04:49 PM, Tue - 9 November 21
నగరంలోని కోంపల్లి ఆస్పైసియాస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 9 మంది ఈ తరగతులకు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
- కాంగ్రెస్ కార్యకర్తలంతా గల్లీలో కష్టపడితే.. దిల్లీలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. 131 కోట్ల ప్రజల ఆకాంక్షలను తీరుస్తుంది.
- మీరు కష్టపడితేనే సోనియమ్మ రాజ్యం వచ్చి తెలంగాణ ప్రజలకు నియంత పాలన నుంచి విముక్తి లభిస్తుంది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం.
- రాహుల్ గాంధీ నాయకత్వంలో.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతోంది. 34,706 పోలింగ్ బూత్లలో ప్రతి బూత్కు ఓ ఎన్రోలర్ ఉంటాడు.
- పార్టీలో ఒకరిపై మరొకరు తమ ప్రతాపం చూపించడం కాకుండా.. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆ ప్రతాపాన్ని టీఆర్ఎస్, బీజేపీలపై చూపించాలి.
- రాష్ట్రంలో యాసంగి పంటపై ఆందోళన చెందుతున్న రైతులకు అండగా నిలిచి వారికి అన్యాయం జరగకుండా చేద్దామని కార్యకర్తలకు చెప్పారు. ఓవైపు పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూనే… మరోవైపు ప్రజాసమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ రెండింటిని సమన్వయం చేస్తూ సోనియమ్మ రాజ్యం వచ్చేలా కృషి చేద్దామన్నారు.
Tags
Related News
Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..
రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ