HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >South Indian Kumbh Mela Cm Revanths Key Instructions

CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

పుష్కరాల ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి వాటిని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనుల జాబితాను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీని కోరేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

  • Author : Gopichand Date : 12-09-2025 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: 2027లో రానున్న గోదావరి పుష్కరాలను ‘దక్షిణ భారత కుంభమేళా’గా ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాన ఆలయాలపై ప్రత్యేక దృష్టి

గోదావరి పుష్కరాలు జూలై 23, 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటినుంచి దాదాపు 22 నెలల సమయం ఉన్నందున దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన ఆలయాలను మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Also Read: Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు

పుష్కర స్నానాల కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, వసతి, స్నానాల ఘాట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

కేంద్ర సహాయం కోసం ప్రణాళిక

పుష్కరాల ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి వాటిని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనుల జాబితాను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీని కోరేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, కుంభమేళా నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోవాలని కూడా సీఎం సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Godavari Pushkaralu
  • South Indian Kumbh Mela
  • telangana
  • telangana govt

Related News

Workers To Get Rs. Crore In

కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన

"కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వం, సింగరేణిని కేవలం ఒక లాభదాయక సంస్థగా మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారంగా చూస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ కోటి రూపాయల బీమా కొండంత అండగా

  • kcr rule

    కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

  • CM Revanth Reddy to visit Medaram on 18th of this month

    ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • CM Chandrababu On Krishna, Godavari River Water

    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు

Latest News

  • మోనాలిసా త‌ర‌హాలోనే వైర‌ల్ అయిన ముగ్గురు అమ్మాయిలు.. ఎక్క‌డంటే?

  • ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్‌ఫర్’ (HILT) పాలసీకి మంత్రి ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్

  • ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!

  • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

Trending News

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

    • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

    • వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd