RTC Bus Overturned: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న యాదగిరి గుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) రాత్రి ఒంటి గంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపుతప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది.
- By Gopichand Published Date - 08:21 AM, Sun - 12 February 23
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న యాదగిరి గుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) రాత్రి ఒంటి గంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపుతప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలు కాగా.. వారిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Also Read: Equatorial Guinea: గినియాలో వింత వ్యాధి కలకలం.. 8 మంది మృతి.. క్వారంటైన్ లో 200 మంది
ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్సై నాగశేఖరరెడ్డి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.