Telangana Politics : తుమ్మలతో రేవంత్ భేటీ..ఇక ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగులేనట్లే..!
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వెళ్తే.. పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హామీ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి
- By Sudheer Published Date - 09:41 PM, Thu - 31 August 23
నిన్నటి వరకు తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కాంగ్రెస్ (Congress) పార్టీ లో చేరతారా లేదా అనే ఆసక్తి..టెన్షన్ అందరిలో ఉండేది..కానీ ఇక ఆసక్తికి …టెన్షన్ కు తెరదించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈరోజు గురువారం సాయంత్రం తుమ్మలతో రేవంత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటీకే రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్..మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో మిగతా పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మోగించారు కేసీఆర్. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాకుండా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో టికెట్ దక్కని వారు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరే పార్టీలలో చేరాలని చూస్తున్నారు. అలాగే ఈసారి టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న వారికీ కూడా కేసీఆర్ మొండిచెయ్యి చూపించడం తో వారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆలా చూస్తున్నవారిలో సీనియర్ నేత తుమ్మల కూడా ఉన్నారు.
Read Also : YS Sharmila: నాకైతే 15 సీట్లు కావాలి: సోనియా ముందు షర్మిల డిమాండ్
బిఆర్ఎస్ (BRS) అభ్యర్థుల లిస్ట్ ప్రకటన లో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడం తో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ప్రకటన తర్వాత తుమ్మల అనుచరులు వరుసగా సమావేశాలు జరిపారు. బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ..తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ సైతం తుమ్మల వంటి సీనియర్ నేత కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ కి మరింత బలం వచ్చినట్లు అవుతుందని భావించారు. ఈ క్రమంలో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే.. రేవంత్ ఆహ్వానంపై తమ్ముల సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అయితే.. గత ఎన్నికలలో ఓటమి పాలైనప్పటి నుంచి తుమ్మలను కేసీఆర్ పక్కకు పెడుతూ వస్తున్నారు. అయితే.. ఈసారైనా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి సత్తా చాటుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్న తుమ్మల.. టికెట్ వస్తుందని ఆశించారు. అయితే.. ఈసారి సిట్టింగులకే ఛాన్స్ ఇవ్వటంతో.. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ కేటాయింటారు. ఈ పరిణామంతో.. తుమ్మల కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వెళ్తే.. పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హామీ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో.. తుమ్మల కూడా కాంగ్రెస్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం. మరి తుమ్మలతో రేవంత్ భేటీ అయిన సందర్భంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా చూస్తుందో వేచి చూడాలి. మొత్తం మీద తుమ్మల కాంగ్రెస్ లో చేరితే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి వంటి నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోపక్క వైస్ షర్మిల సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా రాబోయే రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Tags
Related News
Narendra Modi : నక్సల్స్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా వారిని శత్రువులుగా భావిస్తోంది
కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్తలను దేశ శత్రువులుగా పరిగణిస్తోందని, నక్సల్స్ మాదిరిగానే జేఎంఎంతో పాటు పాతికేళ్ల పార్టీ కూడా దోపిడీ బాధ్యతను చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.