HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sharmila Eyes Key Post In Congress 15 Assembly Tickets

YS Sharmila: నాకైతే 15 సీట్లు కావాలి: సోనియా ముందు షర్మిల డిమాండ్

వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 31-08-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
New Web Story Copy 2023 08 31t202740.945

YS Sharmila: వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. సోనియా రాహుల్ తో జరిపిన కీలక సమావేశంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన విస్తృత అంశాలపై చర్చించినట్టు సమాచారం. వైఎస్ఆర్టీపి తరుపున ఆమె సూచించిన 15మందికి టికెట్లు ఇవ్వాలని తన డిమాండ్ ను వారి వద్ద ఉంచినట్టు తెలుస్తుంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. కనీసం 15 నియోజకవర్గాల్లోనైనా తన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతోంది.సమావేశం అనంతరం షర్మిల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు.వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని షర్మిల చెప్పింది. అయితే విలీనం ఎప్పుడు అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉంటె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించడాన్ని షర్మిల శిబిరం విజయంగా భావిస్తోంది.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున వైఎస్ షర్మిల, విజయమ్మ చురుగ్గా ప్రచారం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, తదనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకోగా, షర్మిల 2021లో వైఎస్సార్‌సీపీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోక్రియాశీలకంగా మారారు. తెలంగాణ కోడలు అని చెప్పుకునే షర్మిల తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.

వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల పార్టీకి అండగా నిలుస్తారని తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరకుండా వైఎస్‌ఆర్‌టీపీ అభ్యర్థులను బరిలోకి దింపితే అది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌తో కలిసి పనిచేసిన నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీకి 2 వేల నుంచి 5 వేల ఓట్లు వచ్చినా అది కాంగ్రెస్‌కు గండిపడే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో షర్మిల రెండు సార్లు సమావేశమైన తర్వాత విలీనంపై చర్చ మొదలైంది.

షర్మిల ఆగస్టు 11న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తెలంగాణకే పరిమితమవుతానని షర్మిల కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు.

Also Read: UP PCS J Result 2022: సివిల్ జడ్జి ఫలితాల్లో 144 ర్యాంక్ సాధించిన శిల్పి గుప్తా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 15 Assembly tickets
  • rahul gandhi
  • sonia gandhi
  • T congress
  • telangana
  • ys sharmila
  • ysr

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Latest News

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd