YS Sharmila: నాకైతే 15 సీట్లు కావాలి: సోనియా ముందు షర్మిల డిమాండ్
వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 08:28 PM, Thu - 31 August 23
YS Sharmila: వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. సోనియా రాహుల్ తో జరిపిన కీలక సమావేశంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన విస్తృత అంశాలపై చర్చించినట్టు సమాచారం. వైఎస్ఆర్టీపి తరుపున ఆమె సూచించిన 15మందికి టికెట్లు ఇవ్వాలని తన డిమాండ్ ను వారి వద్ద ఉంచినట్టు తెలుస్తుంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. కనీసం 15 నియోజకవర్గాల్లోనైనా తన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతోంది.సమావేశం అనంతరం షర్మిల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు.వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని షర్మిల చెప్పింది. అయితే విలీనం ఎప్పుడు అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉంటె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించడాన్ని షర్మిల శిబిరం విజయంగా భావిస్తోంది.
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ షర్మిల, విజయమ్మ చురుగ్గా ప్రచారం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, తదనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకోగా, షర్మిల 2021లో వైఎస్సార్సీపీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోక్రియాశీలకంగా మారారు. తెలంగాణ కోడలు అని చెప్పుకునే షర్మిల తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.
వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల పార్టీకి అండగా నిలుస్తారని తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరకుండా వైఎస్ఆర్టీపీ అభ్యర్థులను బరిలోకి దింపితే అది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో వైఎస్ఆర్టీపీకి 2 వేల నుంచి 5 వేల ఓట్లు వచ్చినా అది కాంగ్రెస్కు గండిపడే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో షర్మిల రెండు సార్లు సమావేశమైన తర్వాత విలీనంపై చర్చ మొదలైంది.
షర్మిల ఆగస్టు 11న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తెలంగాణకే పరిమితమవుతానని షర్మిల కాంగ్రెస్కు స్పష్టం చేశారు.
Also Read: UP PCS J Result 2022: సివిల్ జడ్జి ఫలితాల్లో 144 ర్యాంక్ సాధించిన శిల్పి గుప్తా
Related News
Telangana : రోజుకు 20 లక్షల బీర్లు..అయినా సరిపోవడం లేదని గగ్గోలు..
ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఇసారి ఇలాంటివి ఏవీ కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి