HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sharmila Eyes Key Post In Congress 15 Assembly Tickets

YS Sharmila: నాకైతే 15 సీట్లు కావాలి: సోనియా ముందు షర్మిల డిమాండ్

వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 31-08-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
New Web Story Copy 2023 08 31t202740.945

YS Sharmila: వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో విలీనానికి ప్రతిఫలంగా ఆమె 15 అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. సోనియా రాహుల్ తో జరిపిన కీలక సమావేశంలో తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన విస్తృత అంశాలపై చర్చించినట్టు సమాచారం. వైఎస్ఆర్టీపి తరుపున ఆమె సూచించిన 15మందికి టికెట్లు ఇవ్వాలని తన డిమాండ్ ను వారి వద్ద ఉంచినట్టు తెలుస్తుంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. కనీసం 15 నియోజకవర్గాల్లోనైనా తన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతోంది.సమావేశం అనంతరం షర్మిల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు.వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని షర్మిల చెప్పింది. అయితే విలీనం ఎప్పుడు అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉంటె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించడాన్ని షర్మిల శిబిరం విజయంగా భావిస్తోంది.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున వైఎస్ షర్మిల, విజయమ్మ చురుగ్గా ప్రచారం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, తదనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకోగా, షర్మిల 2021లో వైఎస్సార్‌సీపీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోక్రియాశీలకంగా మారారు. తెలంగాణ కోడలు అని చెప్పుకునే షర్మిల తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.

వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల పార్టీకి అండగా నిలుస్తారని తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరకుండా వైఎస్‌ఆర్‌టీపీ అభ్యర్థులను బరిలోకి దింపితే అది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌తో కలిసి పనిచేసిన నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీకి 2 వేల నుంచి 5 వేల ఓట్లు వచ్చినా అది కాంగ్రెస్‌కు గండిపడే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో షర్మిల రెండు సార్లు సమావేశమైన తర్వాత విలీనంపై చర్చ మొదలైంది.

షర్మిల ఆగస్టు 11న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తెలంగాణకే పరిమితమవుతానని షర్మిల కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు.

Also Read: UP PCS J Result 2022: సివిల్ జడ్జి ఫలితాల్లో 144 ర్యాంక్ సాధించిన శిల్పి గుప్తా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 15 Assembly tickets
  • rahul gandhi
  • sonia gandhi
  • T congress
  • telangana
  • ys sharmila
  • ysr

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd