HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Counter To Harish Rao In Telangana Assembly

Telangana Assembly Session: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు

లంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-12-2023 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Assembly Session
Telangana Assembly Session
  • వేడెక్కిన అసెంబ్లీ సమావేశాలు
  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం,
  • సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా తీసుకున్న రుణాలను మిగిలిన ప్రాజెక్టులకు వాడుకున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బాగా పాలించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేసి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అంటున్న శ్వేతపత్రాలు రాష్ట్ర ప్రగతికి కత్తెర పత్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.కాళేశ్వరం నీళ్లతో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఏటా రూ.5 వేల కోట్లు ఆర్జిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో 5,700 కోట్లు. బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి రుణాలు పొందారన్నారు. కాళేశ్వరం, భగీరథతో ఏటా రూ.10 వేల కోట్లు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని నివేదిక ఇచ్చామన్నారు. తప్పుడు మార్గాల్లో రుణాలు తెస్తున్నారని కాగ్ తప్పుబట్టిందన్నారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మాణం అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణం రూ.97,448 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేసిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని తెలిపారు.

మంచినీటి కోసం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని హరీశ్ రావు అన్నారు. రుణాలను ఎలా వినియోగించుకున్నారన్నది ముఖ్యమన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆస్తులు సృష్టించారని పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రుణాలు తెచ్చామన్నారు. కాగా అసెంబ్లీలో మోటార్లకు మీటర్ల విషయంలో ఉత్తమ్, హరీశ్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటర్లు బిగించమని కేంద్రం చెప్పిందా లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కరెంటు బిల్లులు చెల్లించాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని ఉత్తమ్ బదులిచ్చారు.

Also Read: Hero EV Offer: ఈవీ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా అన్ని రూ.వేల తగ్గింపుతో?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly Session
  • CM Revanth Reddy
  • harish rao
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd