HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Alleges That Ktr Met Nara Lokesh Late At Night

Revanth Alleges : అర్ధరాత్రి లోకేష్ తో కేటీఆర్ మంతనాలు – రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Alleges : అర్థరాత్రి సమయంలో వీరిద్దరూ కలిసి డిన్నర్‌ చేసారన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు. ఈ సమావేశం వెనక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు

  • Author : Sudheer Date : 17-07-2025 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Lokesh Meeting
Ktr Lokesh Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు టీడీపీ నేత నారా లోకేష్ (KTR – Naralokesh) మధ్య జరిగిన రహస్య భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి సమయంలో వీరిద్దరూ కలిసి డిన్నర్‌ చేసారన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు. ఈ సమావేశం వెనక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఈ భేటీ జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సంభవించిన భేటీనా?

కాంగ్రెస్ వర్గాల ఆరోపణల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వకుండా, టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వారినే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేటీఆర్ చెప్పినట్లు ఆరోపిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్‌లోకి చేరడానికి ముందు టీడీపీకి చెందిన నేత. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత పార్టీ మారి బీఆర్ఎస్‌లోకి వెళ్లి రెండుసార్లు గెలిచారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కేటీఆర్-లోకేష్ భేటీ జరగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్ఎస్, టీడీపీ మౌనం – భేటీ నిజమేనా?

ఇంతటి కీలక ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్-లోకేష్ భేటీ వాస్తవమేనా? లేక కాంగ్రెస్ వర్గాల ప్రచారమేనా అన్నది స్పష్టత లేని ప్రశ్నగా మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ ఆరోపణలపై ఎలాంటి వివరణ రాలేదు. దీనివల్ల రాజకీయ వర్గాల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ఖండించకపోవడం వల్ల కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

కేసీఆర్ కుటుంబంపై దర్యాప్తులో రాజీ లేదన్న సీఎం రేవంత్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై కూడా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణను పారదర్శకంగా చేస్తామని తెలిపారు. నిందితులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే అరెస్టులు జరుగుతాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jubilee hills bypoll ticket
  • Jubilee Hills Bypolls
  • ktr
  • Lokesh
  • Revanth Alleges

Related News

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • ఏపీ క్యాబినెట్ భేటీ 29 కి వాయిదా

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

  • ‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న ఏపీలో గ్రామ సభలు

  • గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

  • దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు

Trending News

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd