HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahul Gandhi Should Tell What Congress Which Ruled The Country For Decades Did To The Poor People Mlc Kavitha

MLC Kavitha: ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం, ఇతర పార్టీలది ఓటు బంధం

గతంలో ఏనాడైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నించారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

  • By Balu J Published Date - 05:52 PM, Wed - 16 August 23
  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా, 3 గంటలు కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా.. ప్రజలంతా ఆలోచించి, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ యాత్ర ప్రారంభిచారని, వెయ్యి ఎలుకలను కొట్టిన పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 62 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, పేదలకు, ముస్లింలకు ఏం చేసిందని విమర్శించారు. పేదలను దూరం పెట్టారు తప్ప, పేదరికాన్ని రూపుమాపలేదని కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే వేయాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 750 కంటే పెన్షన్ ఇవ్వడం లేదని, కానీ తెలంగాణలో రూ.4,000 పెన్షన్ ఇస్తామని అబద్దాలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ARR గార్డెన్ నుంచి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తు పాల్గొని పాదయాత్రగా ముందుకు కదిలారు. అనంతరం చక్కర్ నగర్ NSF గ్రాండ్ ప్రాంగణంలో జరగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలి

బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలిరావడం చూస్తుంటే, ఎమ్మెల్యే షకీల్ విజయయాత్రలా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. వేలమంది రోడ్ల మీద నడుస్తుంటే కండ్లలో నీళ్లు తిరిగాయని, కార్యకర్తలంతా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కులాలు, మతాల పేరుతో ప్రజలను విడగొట్టకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. భారతదేశంలో కొందరు కులాల పేరుతో విడగొడతారని, తెలంగాణలో మాత్రం ప్రతి కులానికి హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాలు కట్టడంతో పాటు, అన్ని కులాల వృత్తులకు ప్రభుత్వం తరుపున సహాయం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలో కొందరు మతాల పేరుతో విడగొట్టారని, కాని తెలంగాణలో ప్రభుత్వం అన్ని మతల వారి పండుగలు జరుపుకుంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

బోధన్ ప్రజలకు కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి చేసిందేంటి..?

పదేండ్ల ముందు బీడీ కార్మికులకు పెన్షన్లు రాలేదని, కానీ ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలోనే పది వేల మంది బీడి కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మంచి పనులు ఎవ్వరూ చేయలేదని, వీటి గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి, ఒక్క చెరువును కూడా బాగుచేయలదన్న , కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోధన్ లో 152 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. సుదర్శన్ రెడ్డి పెద్ద వ్యాపారవేత్త అని, షకీల్ మాత్రం సాధారణ కార్యకర్త, బడి పంతులు కొడుకు.. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బోధన్ లో పోటీ సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్య పోటీ ఉందని, ఏది కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు.

ఉద్యోగాలు కల్పించని కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివాళ్లు, ఉద్యోగాలు ఇవ్వని వాళ్లు బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారని, ఎన్నికల ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం కొందరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఎంతోమంది కన్ఫ్యూజ్ చేసినా, పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నారని, ఎవరు ఏం చేసారో ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బోధన్ లో దాదాపు 4,500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, తెలంగాణ ఏర్పడ్డాక బోధన్ లో రూ.2600 కోట్ల రుణాలు అందించామని గుర్తు చేశారు. దేశంలో కేవలం తెలంగాణలోనే 1.30 లక్షల ఉద్యోగాల భర్తీని ప్రకటించామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయలేదని ఎమ్మెల్సీ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో ప్రైవేటు రంగంలో దాదాపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభించిన రోజే 250 మందికి ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఆగష్టు 29 న నిజామాబాద్ లో పెద్దఎత్తున జాబ్ మేళా నిర్వహించి , ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు 52 జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. గతంలో ఏనాడైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నించారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్

బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇతర పార్టీలకు ప్రజలు ఈవిఎంల లాగ కనపడతారన్న ఎమ్మెల్సీ కవిత, కానీ బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సభ్యులలాగ కనపడుతరాని తెలిపారు. మనది పేగు బంధమని, ఇతర పార్టీలది ఓటు బంధం అని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు, రైతులందరికీ పెండింగ్ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలో 35 లక్షల రైతులకు 35 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలంతా రైతుల దగ్గరికి వెళ్లి, రైతుబంధు, రుణమాఫీ గురించి వివరించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కాంగ్రెస్ నాయకులు తిరగబడదాం- తరిమికొడదాం అంటూ కార్యక్రమం నిర్వహించారన్న, గులాబీ కార్యకర్తలు తిరగబడితే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేరన్నారు. గతంలో తెలంగాణ రాదని అనేక మంది కేసీఆర్ ను మాటలు అన్నారని, అయినా తెలంగాణ సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆనాడు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉంటే, నేడు వడ్లు పండించడంలో ఆగ్రస్థానంలో ఉన్నామని, త్వరలో పంజాబ్ ను దాటేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

కేసీఆర్ వెంటే ముస్లింలు

తెలంగాణలోని ముస్లింలంతా కారు-కేసీఆర్- సర్కార్ తప్ప మరోవిధంగా ఆలోచించడం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో మతాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగలేదని, దేశమంతా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ముస్లిం నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉపముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రం తెలంగాణ అని, ముస్లిం నాయుడిని, హోం మంత్రి, రెవెన్యూ మంత్రిగా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వచ్చే ఎన్నిల్లో షకీల్ ను ఎమ్మెల్యేగా మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత నియోజకవర్గ ప్రజలను కోరారు.

Also Read: Thota Chandrasekhar: కాపుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న వైసీపీ సర్కార్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bodhan MLA
  • MLC Kavitha
  • rahul gandhi
  • TCongress

Related News

Rahul Vote Chori Haryana

Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

Vote Chori : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హరియాణా ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగింది

  • Rahul Gandhi Tries Fishing

    Rahul Gandhi : చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్

Latest News

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

  • World Expensive Cars: ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఇవే.. ధ‌ర రూ. 250 కోట్లు!

  • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

  • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

  • Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Trending News

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd