తాజా టీఆర్ఎస్ నేతపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు
మాజీ ఐఏఎస్, తాజా టీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.
- By Hashtag U Published Date - 12:02 AM, Fri - 19 November 21
మాజీ ఐఏఎస్, తాజా టీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.
వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సురేందర్ సింగ్, శంకర్ అనే పరిశోధక విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఐఏఎస్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారని, అలాంటప్పుడు వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా ఆమోదిస్తారని అన్నారు. వెకంట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
ఎన్నికల కమీషన్ ని, శాసన మండలి కార్యదర్శిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ పిల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిల్పై అత్యవరసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.
మరోవైపు తెలంగాణ పీసీసీ నాయకులు కూడా వెంకట్రామిరెడ్డిపై శాసనమండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఐఏఎస్గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండలి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఆరోపణలను, భూసేకరణలో హైకోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయంతో పాలు పలు అంశాలతో కాంగ్రెసు పార్టీ ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను జతచేస్తూ ఎన్నికల అధికారికి తెలంగాణ కాంగ్రెసు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని అందులో విజ్ఞప్తి చేసింది.
Related News
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వ