Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
- By Kavya Krishna Published Date - 12:11 PM, Tue - 5 March 24
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పటేల్ గూడకు ప్రధాని మోదీ (Narendra Modi) చేరుకున్నారు. రూ.9021 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఘట్కేసర్-లింగంపల్లి MMTS, మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే, సంగారెడ్డి X రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు ప్రధాని మోదీ. ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.9వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం బేగంపేటలో ఏర్పాటు చేశాం అని ప్రధాని మోదీ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసే సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్ ద్వారా తెలంగాణకు గుర్తింపు వస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది ఏవియేషన్ స్టార్టప్లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ పనులు చేపట్టామని, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారదీప్ పైపైన్ పనులు చేపట్టాం అని మోదీ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్భవన్ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్లో సంగారెడ్డికి చేరుకున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
Read Also : TDP-JSP : నిడదవోకు లువెళ్తున్న కందుల దుర్గేష్, గోరంట్లకు లైన్ క్లియర్?
Related News
MLC Kavitha : 63 రోజులు అవుతున్నా కవిత బెయిల్పై నో క్లారిటీ..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ ఆమెను గతంలో మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసింది.