HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Money Will Be Doubled In 200 Days Huge Online Fraud In Ap And Telangana Districts

Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్‌తో కుచ్చుటోపీ !

Money Doubling : ‘‘మా వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.

  • By Pasha Published Date - 07:29 AM, Sun - 14 January 24
  • daily-hunt
Ransomware Attack

Money Doubling : ‘‘మా వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి. గడిచిన ఆరు నెలల్లో రూ.8 కోట్ల టర్నోవర్‌ చేశాం. మీరు కూడా చేరండి’’ అంటూ ఓ వ్యక్తి ఎంతోమందిని బురిడీ కొట్టించాడు. కొందరు ప్రజల దురాశను ఆసరాగా చేసుకునే ఈ ట్రిక్‌తో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలతో పాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాల నుంచి దాదాపు రూ.10కోట్ల డిపాజిట్లు సేకరించారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తరుచూ కార్యాలయాలను మార్చారు.. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం బెంగళూరుకు చెందిన ఒకే అడ్రస్(Money Doubling) మెయింటైన్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన వ్యక్తి ఓ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించాడు. గతేడాది జూన్‌లో ఓ వెబ్‌సైట్‌‌ను ఏర్పాటుచేసి.. డబ్బులు డబుల్ అయ్యే ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్‌ నిర్వాహకుడు, మరో ఐదుగురి సహాయంతో ఈ చీటింగ్ స్కీంపై ప్రచారం చేశాడు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లలో రెట్టింపు అమౌంట్ వేశారు. వారితో రికమెండేషన్ చేయించుకొని.. ఇతరులతోనూ డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం మొదలుపెట్టారు. లబ్ధి పొందిన అతికొద్దిమంది కార్లు కొనడం, టూర్లు తిరగడం కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇంకా పెరిగింది. చివరకు ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బుపై.. రోజూ కొంత కమిషన్‌ను ‘నేటి లాభం’ పేరుతో వాలెట్‌లో జమ చేశారే తప్ప, డబ్బులు డబుల్‌గా ఇవ్వలేదు. అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. 2023 జూన్ నుంచి ఇప్పటివరకు 620 మంది ఈ స్కీంలో చేరారని సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Bhogipallu : భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ?

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. గత కొన్నిరోజులుగా దేశంలో అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠపై చర్చ సాగుతోంది. కోట్లాదిమంది హిందువులు రామాలయ ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చివరకు రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌ను కూడా వదలలేదు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది.దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.. దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చోరీకి గురయ్యే అవకాశముంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 200 days Scheme
  • andhra pradesh
  • ap
  • Money Doubling
  • online fraud
  • telangana

Related News

Poisonous Fevers

Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Poisonous Fevers : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులను విషజ్వరాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

Latest News

  • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

  • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

  • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

  • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd