HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Money Will Be Doubled In 200 Days Huge Online Fraud In Ap And Telangana Districts

Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్‌తో కుచ్చుటోపీ !

Money Doubling : ‘‘మా వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.

  • By Pasha Published Date - 07:29 AM, Sun - 14 January 24
  • daily-hunt
Ransomware Attack

Money Doubling : ‘‘మా వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి. గడిచిన ఆరు నెలల్లో రూ.8 కోట్ల టర్నోవర్‌ చేశాం. మీరు కూడా చేరండి’’ అంటూ ఓ వ్యక్తి ఎంతోమందిని బురిడీ కొట్టించాడు. కొందరు ప్రజల దురాశను ఆసరాగా చేసుకునే ఈ ట్రిక్‌తో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలతో పాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాల నుంచి దాదాపు రూ.10కోట్ల డిపాజిట్లు సేకరించారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తరుచూ కార్యాలయాలను మార్చారు.. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం బెంగళూరుకు చెందిన ఒకే అడ్రస్(Money Doubling) మెయింటైన్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన వ్యక్తి ఓ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించాడు. గతేడాది జూన్‌లో ఓ వెబ్‌సైట్‌‌ను ఏర్పాటుచేసి.. డబ్బులు డబుల్ అయ్యే ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్‌ నిర్వాహకుడు, మరో ఐదుగురి సహాయంతో ఈ చీటింగ్ స్కీంపై ప్రచారం చేశాడు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లలో రెట్టింపు అమౌంట్ వేశారు. వారితో రికమెండేషన్ చేయించుకొని.. ఇతరులతోనూ డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం మొదలుపెట్టారు. లబ్ధి పొందిన అతికొద్దిమంది కార్లు కొనడం, టూర్లు తిరగడం కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇంకా పెరిగింది. చివరకు ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బుపై.. రోజూ కొంత కమిషన్‌ను ‘నేటి లాభం’ పేరుతో వాలెట్‌లో జమ చేశారే తప్ప, డబ్బులు డబుల్‌గా ఇవ్వలేదు. అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. 2023 జూన్ నుంచి ఇప్పటివరకు 620 మంది ఈ స్కీంలో చేరారని సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Bhogipallu : భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ?

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. గత కొన్నిరోజులుగా దేశంలో అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠపై చర్చ సాగుతోంది. కోట్లాదిమంది హిందువులు రామాలయ ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చివరకు రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌ను కూడా వదలలేదు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది.దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.. దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చోరీకి గురయ్యే అవకాశముంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 200 days Scheme
  • andhra pradesh
  • ap
  • Money Doubling
  • online fraud
  • telangana

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Ap Egg

    Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd