Threatening Calls: TRS ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..!
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
- By Gopichand Published Date - 12:56 PM, Sun - 13 November 22
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. దీంతో ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యూపీ, గుజరాత్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. ఆ సంఖ్యను 4+4కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు బీజేపీలోకి మారినందుకు రూ.100 కోట్లు ఇస్తామని తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు నేతలు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బెదిరింపులు రావడంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల భద్రత కోసం త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
ఎమ్మెల్యేలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోన్ కాల్లను పోలీసులు ఇప్పటికే విశ్లేషిస్తున్నారని, వ్యక్తులను గుర్తించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే నలుగురు ఎమ్యెల్యేలకు వచ్చిన అనుమానిత ఫోన్ కాల్స్ వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి.
Related News
Lok Sabha Poll : తెలంగాణ లో పోలింగ్ సమయం పొడిగింపు
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది