Telangana: బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు.
- By Praveen Aluthuru Published Date - 05:03 PM, Sun - 29 October 23
Telangana: మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ గులాబీ పార్టీలో చేరారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ అన్నారు.
ఎర్ర శేఖర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తో కలిసి పనిచేశానని గుర్తు చేశారు . రాష్ట్రంలో ముదిరాజ్ సామాజికవర్గ అభ్యున్నతికి రూపొందించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు .
గతంలో ముదిరాజ్ సంఘం పరిస్థితి దయనీయంగా ఉండేది కానీ ఇప్పుడు చేప పిల్లల పంపిణీ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు సంఘం సభ్యుల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయి అని తెలిపారు.
Also Read: Mouse – Space : అంతరిక్షంలో ఎలుకల పిండాలు.. ఏమైందంటే ?
Related News
Kavitha : హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పటిషన్
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి బెయిల్ పిటిషన్(Bail Petition)ను దాఖలు చేశారు. కవితన బెయిల్ పటిషన్ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో �