Love Couple: విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట (Love Couple) అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి వాళ్ల మృతదేహాలను వెలికితీశారు.
- By Gopichand Published Date - 10:31 AM, Thu - 16 February 23
మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట (Love Couple) అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి వాళ్ల మృతదేహాలను వెలికితీశారు. మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావటంతో కల్పన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. 2 నెలల క్రితం కల్పనను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసారు. దీనిని తట్టుకోలేక కల్పన, ఖలీల్ 4 రోజుల క్రితం పారిపోయారు.
Also Read: Road Accident: మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు
పోలీసులు గాలిస్తుండగానే ఇద్దరి మృతదేహాలు నార్సింగి చెరువులో తేలాయి. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న తమ కూతురు కనిపించడం లేదని కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ చెప్పులు, బైకులు కనిపించాయి. దీంతో వీళ్లిద్దరూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. రెండు రోజులు చెరువులో గాలించగా గురువారం ఉదయం ప్రేమికుల మృతదేహాలు లభించాయి.
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ