HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponguleti Key Announcement On Indirammas Houses

Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల‌పై మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌!

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • Author : Gopi Date : 11-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponguleti
Minister Ponguleti

Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, గ్రూప్ -2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, మెస్ ఛార్జీల‌పెంపు, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31వ‌తేదీలోగా పూర్తిచేయాలి. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయ‌ర్‌)ను నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగ‌స్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. అంతేగాక‌ స్థానిక పరిస్థితులను బట్టి క‌లెక్ట‌ర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్ట‌కుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలి. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంత‌ర ప్ర‌క్రియ ఈ ఏడాది 4.5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించ‌బోతున్నామ‌ని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

Also Read: 37th Hyderabad Book Fair : పుస్తక ప్రియులు ఎదురుచూసే సమయం రానేవచ్చింది

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల 7.65 ల‌క్ష‌ల మంది విద్యార్దుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ హాస్టళ్ల‌ను త‌నిఖీ చేసి విద్యార్ధుల‌కు అందించే స‌రుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్ర‌ధానంగా దృష్టి సారించాలి. ఈనెల 14వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్ల‌మెంటు స‌భ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించి అక్క‌డే విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు కూడా పాల్గొనాలని తెలిపారు.

సామాజిక స‌ర్వే

రాష్ట్రంలో 1 కోటి 16 ల‌క్ష‌ల కుటుంబాల‌కు గాను 1 కోటి 12 ల‌క్ష‌ల కుటుంబాల సామాజిక స‌ర్వే (99.09 శాతం) పూర్తి చేయ‌డం జ‌రిగింది. ఇందుకు కృషి చేసిన అధికారుల‌కు ముఖ్య‌మంత్రి త‌ర‌పున‌, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌త్యేక అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈనెల 13వ తేదీ సామాజిక స‌ర్వేకు తుది గ‌డువు. ఆ త‌ర్వాత ప్ర‌జా పాల‌న సేవా కేంద్రాల‌లో కూడా కుటుంబ స‌ర్వే వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • Indiramma Houses
  • Minister Ponguleti
  • Ponguleti Good News
  • telangana
  • telangana politics
  • telugu news

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd