Malla Reddy: 2BHK ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి గరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు
- By Praveen Aluthuru Published Date - 02:32 PM, Thu - 7 September 23
Malla Reddy: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు. స్థానికులు కొందరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని నినదించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిమీ నిలదీస్తూ ప్రశ్నించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్రెడ్డితో కలిసి కొందరు వ్యక్తులు కార్యక్రమంలోకి చొచ్చుకుని వచ్చారు. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని వెనక్కి వెళ్లాలని మంత్రి కోరారు. సహనం కోల్పోయి స్థానిక ప్రజలపై గరం అయ్యారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతను కూడా అదుపులోకి తీసుకున్నారు. సమీర్పేట మండలం బొమ్మరాసిపేట గ్రామపంచాయతీలో 380 2బీహెచ్కే ఇళ్ల పంపిణి కార్యక్రమం జరిగింది.
Minister Malla Reddy lost his cool when grilled by locals during the distribution of double-bedroom houses built at Bommarasipeta Gram Panchayat of Samirpet Mandal of Medchal Malkajgiri district. Locals questioned him alleging unfair allotment which made the #BRS minister… pic.twitter.com/5zU8AYSXuw
— Ashish (@KP_Aashish) September 7, 2023
Also Read: Jawan Review : జవాన్ – ఫుల్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్
Related News
School Fee : స్కూల్ ఫీజుల నియంత్రణపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్
పాఠశాల ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడం , అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.