TS Traffic Challan: గుడ్న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్.
- By Praveen Aluthuru Published Date - 07:52 PM, Wed - 10 January 24
TS Traffic Challan: తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్. కాగా పెండింగ్ చలానాలు భారీ వసూలయ్యాయి. డిసెంబర్ 26 నుంచి నిన్నటివరకు 100 కోట్ల రూపాయల వసూలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ ఉండగా ఒక కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయి. రాయితీలో భాగంగా పెండింగ్ చలాన్లపై 90 శాతం తగ్గించి మిగతా పెండింగ్ చలానా కట్టాల్సి ఉంది. ఈ సౌకర్యంతో తెలంగాణ ప్రజలు అతి తక్కువ ధరకే తమ వెహికిల్ పై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టితో అంటే జనవరి 10వ తేదీతో ముగిసింది.
సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీల కోసం చివరి తేదీని పొడిగించింది. పెండింగ్లో ఉన్న చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు జనవరి 10 నుండి జనవరి 31 వరకు సవరించింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా డిస్కౌంట్ ఉన్నంత వరకు క్లియర్ చేయొచ్చని పేర్కొంది.
వాహనదారులు 1000 రూపాయలు చెల్లించవలసి వస్తే మొత్తంలో 25% అంటే 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం మాఫీ అవుతుంది. చలాన్లపై తగ్గింపు తెలంగాణలోని అన్ని రకాల వాహనాలకు వర్తింపజేసినప్పటికీ, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్ చెల్లిస్తే మిగిలిన 80 శాతం పెండింగ్ చలాన్లు మాఫీ అవుతాయి. చిన్న వ్యాపారులకు ట్రాఫిక్ చలాన్లో 10% చెల్లించినట్లయితే మిగిలిన 90% తగ్గింపు లేదా మాఫీ చేయబడుతుంది. తేలికపాటి మోటారు వాహనాలు, కార్లు, జీపులు మరియు భారీ వాహనాలకు 40% చెల్లిస్తే మిగిలిన 60% మాఫీ అవుతుంది. రోడ్డు రవాణా సంస్థ (RTC) డ్రైవర్లకు, ట్రాఫిక్ చలాన్లో 10% చెల్లిస్తే మిగిలిన 90% తగ్గింపు లేదా మాఫీ అవుతుంది.
Also Read: Health Benefits: ఇవి రెండు కలిపి రాస్తే చాలు.. ఎలాంటి పిలుపుర్లు అయినా రాలిపోవాల్సిందే?
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.