HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Speech At Trs Plenary Highlights

టీఆర్ఎస్ ప్లీనరీ.. గులాబీ బాస్ స్పీచ్ హైలైట్స్!

ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో అడ్డంకులు.. ఎన్నో గెలుపుఓటములను చవిచూసింది.

  • Author : Balu J Date : 25-10-2021 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో అడ్డంకులు.. ఎన్నో గెలుపుఓటములను చవిచూసింది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల నాటి కలను ముద్దాడింది. ప్రత్యేక తెలంగాణ సాధించింది వరుసగా రెండుసార్లు అధికారం కైవసం చేసుకుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్లీనర్ సందర్భంగా అధినేత కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు…

  1. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు అపోహలు. అనుమానాలు. విశ్వాస రాహిత్య పరిస్థితీ ఉండేది. గాంధీజీ ఎన్నో ఆందోళన పిలుపు లు విఫలమయినా పోరాటాన్ని ఆపలేదు. జలియన్ వాలా బాగ్ తర్వాత కూడా స్వాతంత్ర్య పోరాటం సాగింది. తెలంగాణ ఉద్యమం కూడా అలాగే సాగింది.
  2. రాజ్యసభ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయం లో కూడా సమైక్యవాదులు అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకున్నాం. పాలన లో ఏడేళ్ళ నుంచి ఎనిమిదేళ్ల లోకి ప్రవేశించాం.
  3. అభివృద్ధికి సామాజిక స్పృహ జోడించడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే తెలంగాణ లో సక్సెస్ అయ్యాం. కొందరు తెలంగాణ కారు చీకటి అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని చెప్పిన వారికి మనం పాలనతో సమాధానం చెప్పాం.
  4. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మన అభివృద్ధిని చాటుతున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధి లో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుంది. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తం అయ్యాయో ఆ రంగాల్లో విజయం సాధించి చూపాము.
  5. పంజాబ్ ను తలదన్నే రీతిలో 3 కోట్ల  టన్నుల ధాన్యాన్ని పండించాం. తెలంగాణ పథకాల తమ రాష్ట్రం లో ప్రవేశ పెట్టాలని కర్ణాటక. మహారాష్ట్ర లోని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్ జిల్లా ఐదు నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ లో కలుస్తా మంటున్నరు. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మెచ్చుకుని తమ రాష్ట్రంలో వాటిని ప్రవేశ పెట్టాలని కోరారు. దళిత బంధు స్ఫూర్తితో టీఆర్ఎస్ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించాలని అక్కడ్నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
  6. ఇంతగా తెలంగాణ అభివృద్ధి చెందడం నా ఒక్కడి వల్ల సాధ్య పడలేదు. ఇందులో అందరి కృషి ఉంది. సర్పంచ్ నుంచి పై వరకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు. ప్రతీశక్తులు అపుడు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి. అన్నింటినీ అధిగమించి ముందుకు పోతున్నాం.
  7. సాగునీటి ప్రాజెక్టుల కు కోర్టుల్లో అడ్డంకులు సృష్టించారు. వాటిని అధిగమించాం. తెలంగాణ లో కులం. మతం అనే ఇరుకైన ఆలోచన మాకు లేదు. దళిత బంధు ఓ సామాజిక స్వాంతన పథకం. ఇది దేశానికి స్ఫూర్తి. రైతు బంధు ప్రారంభించినపుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇపుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారు. దళిత బంధు కు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణ కు ఓ పెద్ద లెక్క కాదు.
  8. 2028 కల్లా తెలంగాణ బడ్జెట్ నాలుగు లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం తొమ్మిది లక్షల రూపాయలు చేరుతుంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు కొందరు సీఎం లు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారు. దానికి సాహసం కావాలి.
  9. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసం తో ముందుకు సాగి విజయం సాధించాం. దళిత బంధు ను కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తాం. ఇతర వర్గాలకు కూడా ఏదైనా చేయాలంటే అది టీ ఆర్ ఎస్ వల్ల మాత్రమే సాధ్యం.
  10. కాంగ్రెస్ బీజేపీ లు డిపాజిట్లు కోల్పోయే పార్టీలు. టీ ఆర్ ఎస్ మాత్రమే తెలంగాణ అంతటా యూనిఫామ్ గా ఉన్న పార్టీ. టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కు శ్రీరామ రక్ష. ఇదే ధృతి ఉధృతి కొనసాగాలి.  మనకు బాస్ లు తెలంగాణ ప్రజలే.. హై కమాండ్ ఎవ్వరూ లేరు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad
  • speech
  • ten points

Related News

Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

ప్రియుడు మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్‌లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పని

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

Latest News

  • keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

  • TVK Vijay : దేశ వ్యాప్తంగా చర్చ గా మారిన ‘విజయ్’ కులం !

  • West Bengal CM Ceremony : మే 9న బెంగాల్ CM ప్రమాణ స్వీకారం!

  • Kerala Election Results : కేరళంలో గేమ్ ఛేంజర్ గా ‘రేవంత్ రెడ్డి’

  • Tamilnadu Results : సీఎం ఓడిపోయాడు..డిప్యూటీ సీఎం గెలిచాడు !!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd