KCR BRS: కేసీఆర్ స్కెచ్.. ఆ ముగ్గురికి ‘బీఆర్ఎస్’ కీలక బాధ్యతలు!
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) పార్టీ విధానాలను వేగవంతం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
- By Balu J Published Date - 02:45 PM, Fri - 16 December 22
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (BRS) గా మార్చి దూకుడుగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్ (CM KCR). దేశంలో తనవంతు పాత్ర పోషించేందుకు నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) విధి విధానాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను నియమించాలని యోచిస్తున్నారు. బీఆర్ఎస్లోని వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల గురించి తెలిసిన వారిని నియమించే అవకాశం ఉంది, తద్వారా వారు ప్రజల నాడిని తెలుసుకొని, వారితో కనెక్ట్ అవుతారు. పార్టీలోని నేతల బలాలు, బలహీనతలు, హిందీలో అనర్గళంగా మాట్లాడగలగడం వంటి అంశాలను కూడా పార్టీ అధిష్టానం ద్రుష్టి సారిస్తోంది.
మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha), ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడంలో ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ మీడియా సంబంధాలపై శ్రద్ధ వహించాలని పార్టీ అధినేత దాసోజు శ్రవణ్ని కోరే అవకాశం ఉందని కేసీఆర్ కేబినెట్లోని ఓ మంత్రి తెలిపారు.
రాజ్యసభ సభ్యులు డి దామోదర్ రావు, కెఆర్ సురేష్ రెడ్డి, లోక్ సభ సభ్యుడు బిబి పాటిల్ కూడా బోర్డులోకి తీసుకునే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి, మహమ్మద్ షకీల్ అమీర్, హన్మంత్ షిండేలకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో మంచి పరిచయాలు ఉన్నందున వారికి కూడా కొంత బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కే కేశవరావును బీఆర్ఎస్ (BRS) రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఛైర్మన్గా నియమించడాన్ని ముఖ్యమంత్రి (CM KCR) పరిశీలించవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కాన్సెప్ట్ మేకర్స్తో కూడిన బృందాన్ని నియమించాలని పార్టీ అధ్యక్షుడు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. యువ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన్నె క్రిశాంక్, సతీష్ రెడ్డిలకు ప్రచార కమిటీలో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్న రాష్ట్రాలకు నేతలను సిద్ధం చేయడంపైనే ఇప్పుడు దృష్టి సారించింది. భారత రాష్ట్ర సమితి విస్తరణలో పలువురు మాజీ ఎంపీలు, ఇతర పార్టీలకు చెందిన మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ నుంచి నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి నెలాఖరులోగా పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు (KCR) ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరిలో సోషల్ మీడియా (Social media) టీమ్లను కూడా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీస్!
Related News
Kaushik Reddy: హరీష్ రావు రాజీనామాకు రెడీ.. రేవంత్ రెడీయా?: కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించడానికి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం